గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్

ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం, అక్టోబర్ 22: గృహ నిర్మాణంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు. గృహ నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ పనితీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఏపీ గృహ నిర్మాణ శాఖకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా అవార్డు అందించారని అన్నారు. ఈ సందర్భంగా పేదలందరికీ సొంత ఇళ్లు అందించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రాష్ట్రంలో జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతోందని, గృహ నిర్మాణంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్ గా నిలుస్తుందని అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో చేపట్టిన పటిష్ట చర్యలు కారణంగా భారతదేశం ప్రస్తుతం ఎంతో సురక్షితంగా ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులుతో కలకాలం ఆరోగ్యంగా ఉండాలని, దేశానికి మరిన్ని సేవలందించాలని కాంక్షిస్తున్నానని అన్నారు.

Leave a Reply