Suryaa.co.in

Andhra Pradesh

నవ సందేహాలకు సమాధానం చెప్పు

-జగన్‌కు పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నలు

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ తీరని అన్యాయం చేశాడని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి విమర్శించారు. కడపలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైఎస్సార్‌ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తే..జగన్‌ మాత్రం ద్రోహం చేశాడు. గౌరవంగా బతకాల్సిన ఉద్యోగులను అవమానిస్తున్నారు. బొత్స లాంటి వాళ్లు కాళ్లు పట్టుకుని అడగాలి అంటున్నాడు. ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. మేము అడుగుతున్నాం… నవరత్నాలు అని గొప్పగా చెబుతు న్నారు. ఉద్యోగుల విషయంలో మేము అడిగే నవ సందేహాలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

1) అధికారంలో వచ్చాక వారంరోజుల్లో సీపీఎస్‌ విధానం రద్దు చేసి జీపీఎస్‌ విధానం అమలు చేస్తామని చెప్పా రు..ఎందుకు చేయలేదు? జీపీఎస్‌ అవసరం లేదు…మాకు కాంగ్రెస్‌ పార్టీ అమల్లోకి తెచ్చిన ఓపీఎస్‌ విధానం అమలు చేయాలి అంటున్నా ఎందుకు వినడం లేదు?
2) ఒకటో తారీకున జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు…ప్రతినెలా 15 నుంచి 25 మధ్యలో జీతాలు అందుకోవడం ఏంటి? ఇది అసమర్థ పాలనకు నిదర్శనం కాదా?
3) 11వ పీఆర్‌సీ కమిషన్‌లో మీరు ప్రకటన చేసిన ఐఆర్‌ కంటే (27 శాతం) తక్కువ ఫిట్‌మెంట్‌ (23 శాతం ) ఇచ్చిన ఘనత మీది కాదా?
4) 2023 జూలై 1 నుంచి అమలుకావాల్సిన 12వ పీఆర్‌సీ ఇంకా ఎందుకు అమలు చేయలేదు…కేవలం కమిషన్‌ వేశారు…కాలయాపన చేస్తున్నారు. నివేదిక వచ్చే వరకు కొత్త పీఆర్‌సీ ఇస్తామని చెప్పారు.. ఏమైంది ?
5) హెచ్‌ఆర్‌ఏ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. జిల్లా స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 20 శాతం నుంచి 16 శాతానికి ఎందుకు తగ్గించారు?
6) ఉద్యోగులకు చెల్లించాల్సిన 22 వేల కోట్ల పాత బకాయిలు సంగతి ఏంటి?
7) 2022 నుంచి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు రూ.270 కోట్లు 2027లో చెల్లిస్తామని చెప్పడం ఏంటి?
8) ఉద్యోగులు సరెండర్‌ చేసిన లీవులు బకాయిలు రూ.2500 కోట్లు…ఎప్పుడు చెల్లిస్తారు?
9) ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు 118 కోట్లు పెండిరగ్‌ ఉన్నాయి…వీటి సంగతి ఏంటి? అని ప్రశ్నించారు.
ఉద్యోగస్తులకు అండగా ఉండేది కాంగ్రెస్‌ మాత్రమేనని, కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక మళ్లీ పాత ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. పెన్షన్‌ పంపిణీ పేరుతో వృద్ధులను చంపుతున్నారు. మళ్లీ అధికారంలో రాకపోతే పెన్షన్లు ఆగుతాయని భయపెడుతున్నారు. వీళ్లకు జీతాలు ఇచ్చేది వైసీపీనా? ప్రజలా? వైసీపీ ఒత్తిడులకు ఐఏఎస్‌లు తలొగ్గుతున్నారని అన్నారు.

LEAVE A RESPONSE