– ఉద్యోగ సంఘ నేత శ్రీనివాసరావు తన్మయత్వం
– ఏపీ ఎన్జీఓ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
– హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ
– క్యాలెండర్ ను ఆవిష్కరించిన సజ్జల
విజయవాడ: సజ్జలను నడిచొచ్చే దేవుడిగా ఎపి ఎన్జీఒ అధ్యక్షులు బండి శ్రీనివారావు కీర్తించారు. ఆయనేమన్నారంటే.. సిఎం తో ప్రారంభించాల్సి ఉన్నా ఉద్యమం కారణంగా వీలు పడలేదు.సజ్జలనే సిఎం గా భావించి.. ఆయనతో క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాం.పీఆర్సీ సాధన సమయంలో సజ్జల చాలామంది ఉద్యోగులతో మాట పడ్డారు. మరల మనం వచ్చే సంవత్సరం పీఆర్సీ తీసుకుంటాం.అందరు ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇచ్చారు. వచ్చే సంవత్సరం మరలా ఫిట్మెంట్ ఇస్తే మరో ముఫ్పై ఏళ్ళు అధికారంలో ఉంటారు. ఇన్ని ఇచ్చినా ఇంకా ఏదో వెలితి మాకు ఉంది.
మహిళా కమిషన్ చైర్ పర్సన్, వాసిరెడ్డి పద్మ:
మహిళా ఉద్యోగుల ప్రత్యేక సమస్యలు మాకు అర్ధమౌతాయి.ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ పూర్తిస్థాయిలో వస్తుంది.ఇటీవల మహిళా ఉద్యోగులు డిప్రెషన్ కు లోనవుతున్నారు. మహిళలు బలంగా తయారవ్వాలి. గత ప్రభుత్వాలలో మహిళలకు జరిగిందేమిటి.. వైసీపీ ప్రభుత్వంలో జరిగినదేమిటి మహిళలు గుర్తించాలి. రాజకీయాల్లో సైతం భార్యలను ముందుకు తీసుకొచ్చే భర్తలున్నారు. మహిళల పాలన సమాజం జీర్ణించుకోవడం కష్టమే.మహిళా సాధికారతకు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సజ్జల రామకృష్ణారెడ్డి:
మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చాను. అత్యంత చైతన్యం కలిగినవారు మహిళలు. విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలు ఉంటాయి. ఉద్యోగు లు పాలసీ లు అమలు చేస్తారు. జగన్ సీఎం అయ్యాక మహిళా సాధికారతకు అర్ధం కల్పించారు.కుటుంబం సొంత కాళ్ళమీద నిలబడటంలో మహిళ పాత్ర ముఖ్యం.సీఎం జగన్ స్కూళ్ళను బాగు చేస్తున్నారు.పిల్లల భవిష్యత్తును తల్లి నిర్ణయించుకునేలా పధకం రూపొందించారు. తల్లి క్రియాశీలక పాత్ర పోషించాలంటే నిర్ణయాధికారం వారికి ఉండాలి. మహిళ పేరు మీద ఇళ్ళు ఇచ్చాం. అట్టడుగు వర్గాల నుంచీ పైకి రావాలని చూసే మహిళలకు చేయూత అందించాలి. దిశ చట్టం.. కోటి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్న దిశ యాప్ తయారైంది. మహిళలుగా సాధికారత సాధన కోసం పనిచేయాలి. మహిళల విషయాలపై సెమినార్లు జరగాలి. మహిళల సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం పనిచేస్తోంది. చైల్డ్ కేర్ లీవ్ కూడా జీఓ అయ్యి సిద్ధంగా వస్తుంది.