Suryaa.co.in

Andhra Pradesh

క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత నన్ను తీవ్రంగా బాధించింది

– కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల

ఈరోజు వైఎస్ఆర్టీపీ ను కాంగ్రెస్ లో విలీనం చేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత. ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ. అన్ని వర్గాలను కలుపుకుంటూ, అందరినీ కలుపుతూ పని చేస్తుంది. ఒక క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత నన్ను తీవ్రంగా బాధించింది. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ పై నమ్మకాన్ని నాతో పాటు ప్రజలందరిలో పెంచింది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదు రాహుల్ గాంధీ నీ ప్రధానిగా చూడాలన్నది నా తండ్రి అశయం.

LEAVE A RESPONSE