దోపిడీ బయటపడుతుందనే టిడిపి నేతల అడ్డగింత!

– టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన ఈనెల 28నుంచి తలపెట్టిన ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పోరుబాటకు బయలుదేరుతున్న టిడిపి నేతలు బుద్దా వెంకన్న, గౌతు శిరీష వంటి నేతలను నిర్బంధించడాన్ని బట్టి చూస్తే జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైనట్లు స్పష్టమవుతోంది.

ఉత్తరాంధ్రలో జె-గ్యాంగ్ దోపిడీ బండారాన్ని బయటపెట్టేందుకు బయలుదేరిన టిడిపి నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికం. ప్రశ్నించే గళాలపై జగన్ రెడ్డి పోలీసులతో చేయిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుబాటను విజయవంతం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాను.

Leave a Reply