ఏపీలో ఎమర్జెన్సీని మించిన దారుణ పరిస్థితులు

-జీవో నెంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల నియంత్రణ అప్రజాస్వామ్యం
-ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రకటన
-కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని ఖండించిన పవన్ కల్యాణ్
-చంద్రబాబు నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపిన జనసేన అధినేత పవన్

హైదరాబాద్:- ఏపీలో ఎమర్జెన్సీని మంచి ఆరాచక పాలన సాగుతుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీవో నెంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల, ప్రజా సంఘాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. దీనిపై రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ప్రజా స్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు తో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ రెండున్నర గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు.

తాజాగా ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 ద్వారా కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని పవన్ తప్పు పట్టారు. ఈ ఘటనపై తెలుగు దేశం అధినేత చంద్రబాబుకు జనసేన అధ్యక్షులు పవన్ సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.

ముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… కుప్పంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై చర్చించేందుకే చంద్రబాబు నాయుడుని కలిసినట్లు తెలిపారు. తమ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, బ్రిటీష్ జీవో నెం.1తో ప్రభుత్వం సృష్టిస్తున్న ఆటంకాలపై చర్చించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోంది…ప్రతిపక్షాల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తోంది…కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవడం సరికాదు అని పవన్ కల్యాణ్ అన్నారు. పెన్షన్లను ఇష్టానుసారం తొలగిస్తున్నారు… రైతులకు మద్దతు ధర కల్పించడం లేదు… ప్రతిపక్షాలను ప్రజల్లో తిరగనివ్వడం లేదు అని ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఓడిపోతామనే భయంతో చెత్త జీవోలను తెస్తున్నారన్న పవన్ కల్యాణ్….విశాఖలో కూడా నాపై ఆంక్షలు పెట్టారు అని అన్నారు. ఇప్పుడు సీనియర్ నేత చంద్రబాబును కూడా అడ్డుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దుర్మార్గం అని పవన్image కల్యాణ్ మండిపడ్డారు. ఫ్లెక్సీలు నిషేధం అని ప్రభుత్వం చెపుతుంది…కానీ జగన్ పుట్టిన రోజుకు అన్ని చోట్లా ఫ్లెక్సీలు పెడతారు. కోవిడ్ సమయంలో అందరికీ ఆంక్షలు పెట్టారు….కానీ వైసిపి నేతలు మాత్రం నిబంధనలు పాటించలేదు. ఇప్పుడు జీవో నెంబర్ 1 కూడా అంతే….ఈ నిబంధనలు అన్నీ ప్రతిపక్షాలకే..అధికార పక్షానికి వర్తించవు అనేది తెలుస్తూనే ఉంది అని పవన్ వివరించారు.

సభలు జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ చూడాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే. పోలీస్ లు బందోబస్తు ఇవ్వకపోతే ఏమనాలి. పోలీసుల బదులు మేం లాఠీలు పట్టుకోవాలా…మరి పోలీసులు ఏం చేస్తారు. కందుకూరు, గుంటూరు ఘటనలు సెక్యూరిటీ పరంగా జరిగిన వైఫల్యం. కోడికత్తి డ్రామాలు ఆడే పార్టీనే ఈ ఘటనల వెనుకా ఉంది అనే అనుమానం ఉంది. సభలకు భద్రత ఇవ్వకపోవడం కుట్ర కాదా అని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజంగా వైసీపీ సంక్షేమ పథకాలు అంత ఫలితాన్ని ఇస్తుంటే…అంత మంది ప్రజలు గుంటూరులో సంక్రాంతి కానుక కోసం ఎందుకు తరలి వచ్చారు అనేది కూడా చూడాల్సి ఉంది.

వచ్చే ఎన్నికల్లో తాము ఓడిపోతున్నాం అని వైసీపీకి అర్థం అయ్యింది. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకు బీజేపీతో కూడా సంప్రదిస్తాను అని పవన్ కల్యాణ్ అన్నారు. నాకు ఎవరూ ఎదురు తిరగకూడదు అనే విధానం ఈ ప్రభుత్వ దిగజారుడు తనం అని పవన్ కల్యాణ్ అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న వైసిపి వాళ్ల నోర్లు పాచినోళ్లు అని పవన్ కల్యాణ్ అన్నారు. ఇరిగేషన్ గరించి తెలియని అంబటి నాపై విమర్శలు చేస్తారా….విధానాలపై మాట్లాడలేరా అని పవన్ ప్రశ్నించారు. తాను యాత్ర కోసం వారాహి కొనుగోలు చేస్తే కూడా వైసిపి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అని పవన్ అన్నారు. ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా ఒకే గళం వినిపించాలి అనేది మా ఆలోచన. ఆ అంశంపైనే ఈ రోజు చర్చించాం అని పవన్ కల్యాణ్ అన్నారు.

అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. కుప్పంలో తన పర్యటనను అడ్డుకున్న వైసిపి ప్రభుత్వం…అంతకుముందు వైజాగ్ లో, ఇప్పటంలో పవన్ కల్యాణ్ ను అడ్డుకున్నారని అన్నారు. 2019image-1తరువాత అనేక సందర్భాల్లో వైసిపి ప్రభుత్వం తనను అడ్డుకుందని చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా ఆత్మకూరు, వైజాగ్, తిరుపతి పర్యటనలకు వెళ్లిన సమయంలో తనను గతంలో ఎలా అడ్డుకుంది వివరించారు.

రాజధాని ప్రాంతంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళితే వైసిపి కార్యకర్తలు దాడులు చేస్తే…వాటిని కూడా డిజిపి నాడు సమర్థించారు అని అన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ప్రశ్నిస్తే మా పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు అన్నారు. రాజకీయ పార్టీలకు రాజకీయ విధానాలు ఉంటాయి..కానీ వైసిపి కి మాత్రం రౌడీ యిజం, గుండాయిజం మాత్రమే ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టం తెరమీదరకు తెచ్చి..దానికి ఉన్న చట్టబద్దత ఏంటో కూడా తెలియకుండా జీవో నెంబర్ 1 అనే నల్ల జీవో తెచ్చి ఆంక్షలు పెట్టారు.

7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన నియోజకవర్గానికి వెళితే అడ్డుకుంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు మూడు వేల మంది పోలీసులను పెట్టి కుప్పంలో నా పర్యటనను అడ్డుకున్నారు. నా గత పర్యటనలో కుప్పంలో 74 మందిపై కేసులు పెట్టారు. నిన్నటి పర్యటనలో చివరికి పోలీసులే మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టారు అంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. సిఎం, వైసిపి నేతలు మీటింగ్ లు, సమావేశాలు పెట్టుకోవచ్చు…కానీ ప్రతిపక్షాలు పెట్టుకోకూడదు అంటున్నారు. కందుకూరు, గుంటూరు ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది….ఆ సభలకు బందోబస్తు ఎందుకు పెట్టలేదు.

సభలు, మీటింగ్ లు జరుగుతున్నప్పుడు బందోబస్తు ఇవ్వాల్సిన బాద్యత పోలీసులది కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలపై ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో పోరాటం చేస్తాం. నల్ల చట్టాలపై ప్రజా పోరాటం, న్యాయ పోరాటం కూడా చేస్తాం. పవన్ కల్యాణ్ యాత్రలు చెయ్యకూడదు….లోకేష్ పాదయాత్ర చేపట్టకూడదు అనేది వైసిపి ఆలోచన. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మీడియా, ప్రజా సంఘాలు సహా అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు అన్నారు.

మీడియాకు రాసే స్వేచ్చ, రాజకీయ పార్టీలకు తిరిగే స్వేచ్ఛ ఉంటేనే ప్రజల మనుగడ అని అంతా గుర్తించాలి అని చంద్రబాబు అన్నారు. రాజకీయ పార్టీల నేతలను వ్యక్తి గతంగా దూషించడమే రాజకీయమా అని చంద్రబాబు అన్నారు. కుప్పంలో నన్ను వెనక్కి పంపాలి అని చూశారు…కానీ నేను వెనక్కి తగ్గలేదు…నేను నిలదీస్తే పోలీసులు సమాధానం చెప్పలేదు అని చంద్రబాబు అన్నారు. జీవో నెంబర్ 1 ద్వారా ఆంక్షలు లేవు అన్న బొత్స వ్యాఖ్యలను చంద్రబాబు పూర్తిగా కొట్టిపారేశారు.

బొత్స ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు అని అన్నారు. ప్రతిపక్షాలకు మీటింగ్ లు పెట్టుకోవడానికి ఎందుకు అనుమతులు, స్థలాలు ఇవ్వరో చెప్పాలి అని చంద్రబాబు ప్రభుత్వాన్ని పశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకోవడం కోసం ఇటు గవర్నర్ నుంచి అటు రాష్ట్ర పతి వరకు అందరి దృష్టికిimage-2 తీసుకువెళతాం. అవసరాన్ని బట్టి కేంద్రం కూడా కలుగ జేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చంద్రబాబు నాయుడు అన్నారు. నేడు రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని వీటిపై పోరాడుతామని చంద్రబాబు తెలిపారు.

Leave a Reply