– బీసీలను బ్యాక్బోన్గా గుర్తించిన వైయస్ జగన్
– బీసీల వెన్ను విరిచిన ఘనుడు చంద్రబాబు
– బీసీల ఆత్మగౌరవాన్ని కాల రాస్తున్న కూటమి పార్టీలు
– రాజకీయంగా బీసీల ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు
– స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర స్ధాయి కార్యవర్గ సమావేశంలో నేతల ధ్వజం
తాడేపల్లి: రాష్ట్రంలో సామాజిక న్యాయంను సాధించేందుకు చిత్తశుద్దితో కృషి చేసిన నాయకుడు వైయస్ జగన్ అని వైయస్ఆర్సీపీ నేతలు అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే, స్వర్గీయ మహానేత వైయస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇటీవల శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ హత్యకు గురైన బీసీ నేత కురుబ లింగమయ్య మృతికి సంతాపం ప్రకటించారు.
అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన కులాలకు అండగా నిలిచి, వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్ళిన దార్శనికుడు వైయస్ జగన్ అని కొనియాడారు. ఆయన నేతృత్వంలో వైయస్ఆర్సీపీ బీసీల అభిమానాన్ని చూరగొందని పేర్కొన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు గత పదినెలలుగా బీసీలపై దాష్టీకాలకు పాల్పడుతున్నాయని, బీసీలను అణచివేస్తున్నాయని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైయస్ఆర్సీపీ నేతృత్వంలో కూటమి దౌర్భాగ్యపు పాలనపై బీసీలు తిరుగుబాటుకు సిద్దం అవుతున్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన పార్టీ వైయస్ఆర్సీపీ: స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
స్వాంతత్రం వచ్చిన తరువాత సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీ. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతాయి, కానీ మాటల్లో కాదు చేతల్లో చూపించింది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. ఇది ప్రజలకు కూడా తెలుసు. ఐదేళ్ళలో వైఎస్సార్సీపీ వారు ఎవరైనా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా వైయస్ జగన్ పాలించారు.
చంద్రబాబుది అవకాశవాద రాజకీయం, అధికారంలోకి రాగానే దోచుకోవడం. చంద్రబాబు ఈ సారి గతంలోలాగా కూడా చెప్పడం లేదు, ఓపెన్ గానే నేను చేయనంటున్నాడు, బరితెగించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఈ పదినెలల పాలన చూసి జనానికి అర్ధమవుతుంది. చంద్రబాబు దుర్మార్గపు పాలనను మనం ప్రజల్లోకి తీసుకెళదాం. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. అధికార యంత్రాంగమే మాఫియా ముఠాలా వ్యవహరిస్తుంది.
విశాఖలో నానారకాలుగా చేసి అవిశ్వాసం నెగ్గించగలిగారు. ఒక బీసీ మహిళ మేయర్ గా ఉన్న చోట పదవి నుంచి తప్పించారు. ఎక్కడా బలం లేకపోయినా బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మనం తట్టుకుని నిలబడ్డాం. ప్రజల మద్దతు మనకు మొదటి నుంచి ఉంది కాబట్టి అదే మనకు శ్రీరామ రక్ష. అనుబంధ విభాగాలు ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుంది. బలమైన నెట్వర్క్ను ఏర్పాటుచేసుకుని చురుగ్గా పనిచేద్దాం.
కూటమి పాలనలో బీసీలపై అరాచకాలు: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్
బీసీలు ఎవరికీ భయపడనవసరం లేదు, ప్రజల్లోకి మనం దూసుకువెళుతున్నాం. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అని మన నాయకుడు జగన్ నిర్వచించారు, మన పార్టీ బీసీల నుంచే ఉద్భవించింది. కూటమి పాలనలో అరాచకాలు అణగారిన వర్గాలపై ఎక్కువగా జరిగాయి. అనంతపురం జిల్లాలో బీసీ నేత కురుబ లింగమయ్యను దారుణంగా చంపారు. మన బీసీలంతా ఒక్కటై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎదిరించాల్సిన సమయం వచ్చింది. విశాఖ మేయర్ గా ఒక బీసీ మహిళను జగన్ నియమిస్తే ఆమె పదవీ కాలం ముగియకముందే అక్రమంగా దింపేశారు.
బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. రమేష్ యాదవ్, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రసంగించారు.