Suryaa.co.in

Andhra Pradesh

సీఎస్‌ కు బాబు లేఖ

-కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులు
-బాధితులను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని వినతి

అమరావతి, మహానాడు: కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం సీఎస్‌ జవహ ర్‌రెడ్డికి లేఖ రాశారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కంబోడియా లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఉపాధి అవకాశాలు కల్పి స్తామని నకిలీ ఏజన్సీలు యువతను మోసం చేశాయని, ఈ వ్యవహారం ఎన్‌ఐఏ విచారణలో బయటపడిరదన్నారు. బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. కాంబోడియా, లావోస్‌, ఇతర ప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధిత యువత గమ్యస్థానాలకు చేరుకుంటోందని, కేంద్రప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.

LEAVE A RESPONSE