Suryaa.co.in

Andhra Pradesh

పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం

-ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ప్రతి అడుగు ప్రజల కోసం
-టీడీపీ నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు సందేశం

-101వ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ నివాళి

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం ఆయనను స్మరించుకుంటూ సందేశమిచ్చారు. తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్‌. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందాం. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతుబిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకుడిగా తీర్చిదిద్దాయి. సమాజమే దేవాలయం `ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి ఆచరించి చూపారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవ కుడు అని చాటి చెప్పారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్‌ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగుజాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందా మని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE