-ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి
-మే 9లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సోమవారం ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఇసుక అక్రమ తవ్వకాలపై తీసుకున్న చర్యలపై మే 9వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తేదీ లోపు అక్రమ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణ మే 10వ తేదీకి వాయిదా వేసింది.