– నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించే నైతికత ఆంధ్రప్రదేశ్ కు ఎక్కడిది?
– డి.పి.ఆర్ నివరించండి
– టెండర్లు తక్షణమే నిలిపివేయాలి
-కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ కు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్రీ-ఫీజుబిలిటి రిపోర్ట్(పి.ఎఫ్.ఆర్) ను తక్షణమే తిరస్కరించాల్సిందిగా తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ను అడ్డు కోవడం తో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను నిలువరించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ కు బహిరంగ లేఖ రాశారు.
1980 లో గోదావరి జలాల ఒప్పందాన్నీ ఉల్లంఘించినట్లు అవుతుందని, గోదావరి జల వివాద ట్రిబ్యునల్ ను పరిగణనలోకి తీసుకోవడం తో పాటు ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణా కు దక్కాల్సిన గోదావరి నది వాటా హక్కును ప్రత్యక్షంగా ధిక్కరించడం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సంవత్సరం జూన్ 2 న నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖా అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్ చేసిన సూచన ఇందుకు అద్దం పడుతోందన్నారు. అప్పటికే పి ఎఫ్ ఆర్ ఆమోదించినట్లు భావించాల్సి వచ్చిందన్నారు.
ఇందుకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించడం అంటే కేంద్ర జల వనరుల సంఘం ఆమోదించి నట్లు అవుతుందా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబాటు తనాన్ని అడ్డు పెట్టుకుని, ప్రాజెక్ట్ కోసం కేంద్రాన్ని నిధుల కోసం వత్తిడి చేసిన అంశాన్ని జనవరి 22,2025 న కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ తో పాటు ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాసిన సందర్బన్నీ ఆయన ప్రస్తావించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు కోసం 2024, నవంబర్ 15 న,డిసెంబర్ 29 న కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయించారన్నారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం 80,113 కోట్లు కాగా గోదావరి నుండి కృష్ణా వరకు 13,511 కోట్లు అవుతుందని, కృష్ణా నుండి బొల్లపల్లి రిజర్వారాయర్ కు 28,560 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన ఆ లేఖలో వివరించారు
అదే విధంగా బోళ్లపల్లి నుండి బనకచర్ల హెడ్ రెగ్యులెటరీకీ 38,041 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కేంద్ర జలవనరుల కమిషన్ తో పాటు గోదావరి-కృష్ణా నది బోర్డులు 9 ఏపేక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగిందని ఆయన మండిపడ్డారు.
జీ. డబ్ల్యూ.డి.టి అవార్డు ప్రకారం చూసినా 1,486 టి.యం.సి లలో 968 టి.యం.సి లు తెలంగాణా కు కేటాయించ బడ్డాయని, ఈ నీటి వాటలలో తెలంగాణా కేటాయింపులకై కేంద్ర జల వనరుల సంఘం,గోదావరి నది మేనేజ్మెంట్ బోర్డు ఆమోదం కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల ను ఎలా ప్రతి పాదిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించే నైతికత ఆంధ్రప్రదేశ్ కు ఎక్కడిదని ఆయన నిలదీశారు. వాస్తవానికి గోదావరి నది జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ప్రకారం వరద నీరు అనే ప్రస్తావన లేనే లేదని, ఉంటే గింటే నది సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలకు సరి సమాన హక్కు ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు.
కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ ఇచ్చిన లేఖలో సైతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలు మాకు అందలేదు అని రాసిన లేఖను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఉటంకించారు. కేంద్ర జలవనరుల సంఘము మార్గదర్శాకలు ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతర్ రాష్ట్ర ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసు కుంటామాన్నారు.
అయితే అదే సమయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలు తెలంగాణా ప్రాంతాన్ని గందరగోళంలోకి నెట్టి వేస్తున్నాయాని నిబంధనల ప్రకారం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై జోక్యం చేసుకుని టెండర్ల ప్రక్రియను నిలువరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అదే జరిగితే తెలంగాణ రాష్ట్రం పై జరిగిన దాడి గా పరిగణించడంతో పాటు న్యాయబద్దంగా జరగాల్సిన నీటి కేటాయింపులకు భగ్నం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.