Suryaa.co.in

Telangana

కేసీఆర్‌ లాంటి గలీజు లీడర్‌ ఇంకొకరు లేరు

-హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా?
-వినోద్‌ ఓడిపోతే బీఆర్‌ఎస్‌ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా?
-ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆరే
-నా వెనుక 80 శాతం హిందువులున్నారు…
-కేసీఆర్‌ను ఓడిరచేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటావా?
-బీజేపీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఫైర్‌

20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా? హిందువులారా మీ సత్తా ఏందో కేసీఆర్‌కు మళ్లీ రుచి చూపించాలని బీజేపీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్‌ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో బీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌లపై ఆయన నిప్పులు చెరిగారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా…వినోద్‌ ఓడిపోతే బీఆర్‌ఎస్‌ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా? అని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు.

మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్‌ కుట్ర
కేటీఆర్‌ నోటి నుంచి జై శ్రీరామ్‌ మాటే రాదా..కరీంనగర్‌ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్‌ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. ఓట్ల కోసం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన సైనికులనే అవమానిస్తా వా? కేసీఆర్‌ లాంటి గలీజు లీడర్‌ ఇంకొకరు లేరు. కేసీఆర్‌ లాంటి ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలర్‌ ఈ ప్రపంచంలోనే లేరు. ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌తో 1400 మంది ప్రాణాలను బలిగొన్న రాక్షసుడివి నువ్వే..ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడివి నువ్వే.. అంటూ ధ్వజమెత్తారు. రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్‌ ఇవ్వకుండా జాతీయ హోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకున్న మోసగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకరిస్తున్న దగుల్బాజీ కేసీఆర్‌ అన్నారు. తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చింది. ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? చర్చకు సిద్ధమైతే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో ఆధారాలు నిరూపిస్తామని సవాల్‌ విసిరారు.

నన్ను ఓడిరచేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుట్రలు
కేసీఆర్‌తో కుమ్మక్కైన కాంగ్రెస్‌ నేతలు కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే నన్ను ఓడిరచడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయన్నారు. ఓటుకు రూ.5 వేలు ఒకరు, రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నారని వ్యాఖ్యానించారు. అయినా కరీంనగర్‌ ప్రజలంతా నావైపే ఉన్నారు. సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా? బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా? విద్యుత్‌ బిల్లులు, యార్న్‌పై సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా? రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది? తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత మాది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని స్పష్టం చేశారు. కేటీఆర్‌ సభలో ప్రశ్నించిన హిందుత్వవాదుల అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A RESPONSE