టీఆర్ఎస్ నేతలను చెట్టుకు కట్టేసి నిలదీయండి

-పేదల రక్తం తాగుతూ కోట్లు దండుకుంటున్న దుర్మార్గుడు కేసీఆర్
-డబ్బులిచ్చేటోడు మోదీ పేదోడు… వడ్డించేవాడు పేదోడే కావాలి
-బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇంజనీరింగ్, డాక్టర్ వంటి విద్యను సైతం ఉచితంగా అందిస్తాం
-ఎంత పెద్ద రోగమొచ్చినా ఫ్రీగా చికిత్స చేయిస్తాం
-కేంద్ర పథకాలు దక్కాలంటే బీజేపీ అధికారం ఇవ్వాలి
-9వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్

‘‘ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యలే. ఉద్యగాలియ్యలే. నిరుద్యోగ భ్రుతి ఇయ్యలే. దళితులకు మూడెకరాలు ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతడంత అయితది. అందుకే ఈసారి టీఆర్ఎస్ నేతలు మీ వద్దకు వస్తే చెట్టుకు కట్టేయండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీయండి. ఆ రోజు మీరు అరిచే అరుపులకు టీఆర్ఎస్ నేతల చెవుల్లోనుండి రక్తం కారాలే…’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

9వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు (శుక్రవారం) శెట్టి అత్మకూర్ స్టేజీ నుండి జూరాల మీదుగా నందిమల్ల గ్రామం వరకు మొత్తం 17 కిలోమీటర్లు నడిచారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి సహా పలువురు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మదన పల్లి స్టేజీ, ఈడిగొని పల్లి స్టేజీ వద్ద పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి సంజయ్ కు స్వాగతం పలికారు.

ఈడిగొని పల్లి స్టేజీ తర్వాత మున్నురుకాపు సంఘం సంజయ్ కు ఘనంగా సన్మానించింది. పెద్ద పాడులో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి సంఘం సన్మానం వినతిపత్రం అందజేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను కొనసాగించారు. పెదపాడు గ్రామం దాటిన తరువాత మధ్యాహ్న భోజనం చేసిన బండి సంజయ్ కొద్దిసేపు విరామం అనంతరం చిన్న పాడ్, యమ్ములోని పల్లి, చింత రేవులలో పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా చింత రేవులలో ‘‘జనం గోస – బీజేపీ భరోసా’’ పేరిట నిర్వహించిన గ్రామసభలో స్థానికులు హాజరై తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఫించన్ రావడం లేదని కొందరు, ఇండ్లు మంజూరు కాలేదని ఇంకొందరు… తమకు ప్రభుత్వం నుండి ఏ పథకం కూడా అందడం లేదని ఇంకొందరు సంజయ్ ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా చింత రేవుల ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు..

కేసీఆర్ ఇఛ్చిన హామీలేవీ ఇంతవరకు నెరవేరలేదు. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భ్రుతి హామీలేవీ అమలు కాలేదు. ఇకపై మీ ఊరుకు టీఆర్ఎస్ నేతలు మీ వద్దకొస్తే చెట్టుకు కట్టేయండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలెందుకు అమలు చేయడం లేదని నిలదీయండి. మీరు అరిచే అరుపులకు వాళ్ల చెవుల్లో రక్తం కారాలి.

ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల రక్తం తాగుతూ వేల కోట్ల రూపాయలు దోచుకుతింటున్నడు. పేదలంటే ఆయనకు చులకన. ఎన్నికలొస్తే డబ్బులిస్తే వాళ్లే ఓట్లేస్తారనే అహంకారం ఉంది. ఈసారి ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలి.

గద్వాల్ జిల్లాలో అకాల వర్షాలతో, నకిలీ విత్తనాలతో మిర్చి, పత్తి పంట దెబ్బతిని రైతులు నష్టపోయినా కేసీఆర్ నయా పైసా సాయం చేయలేదు. రైతులు అల్లాడుతున్నా పట్టించుకోని దుర్మార్గుడు కేసీఆర్.
ఎన్నికలొస్తే… ఊరిలో గట్టిగా ప్రశ్నించే వాళ్లలో ఒక్కరికి దళిత బంధు పథకం మంజూరు చేస్తున్నట్లు పేపర్ చూపించి అందరినీ మోసం చేసి ఓట్లేయించుకోవాలనుకుంటడు. కేసీఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు. గ్రామ పంచాయతీలకు మంజూరు చేసే నిధులన్నీ కేంద్రానివే. గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి పనులన్ని కేంద్రం ఇచ్చిన నిధులతో చేసినవే.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదవాడు. అందుకే పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిండు. పేదల బాగుపడాలని తపన పడుతుండు. పేదలు వెళ్లినా కలిసి వారి బాధ వింటాడు. కానీ కేసీఆర్ పెద్దోడు. గడీల్లో ఉంటాడు. ఎవరినీ కలవడు. పేదలను పట్టించుకోడు.

తెలంగాణకు నిధులిచ్చేవాడు నరేంద్రమోదీ… కానీ వడ్డించే వాడు కేసీఆర్ కావడంవల్ల ఆ నిధులేవీ ప్రజలకు చేరడం లేదు. పథకాలేవీ మీకు అందడం లేదు. అందుకే నిధులిచ్చే పువ్వు పార్టీయే రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి రావాలి. అప్పుడే పేదలందరికీ న్యాయం జరుగుతుంది.

బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డాక్టర్ సహా ఎంత పెద్ద విద్యనైనా ఫ్రీగా అందిస్తాం. ఎంత ఖర్చైనా భరిస్తాం. పేదలకు ఎంత పెద్ద రోగమొచ్చినా రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ట్రీట్ మెంట్ చేయిస్తాం.
ఇప్పుడు ఎన్నికల్లేవు. వాస్తవాలు తెలుసుకోండి. మేం చెప్పింది నిజమని నమ్మితేనే బీజేపీకి ఓటేసి అధికారం ఇవ్వండి

Leave a Reply