Suryaa.co.in

International National

అమెరికాలో భద్రాచలం తరహా రామాలయం

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్‌ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయ పనులు చేపట్టినట్లు వివరించారు. తోటి అర్చకులతో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు. అట్లాంటాలో రామాలయ పనులు సాగుతున్నాయని, ప్రధాన కోవెల విడిభాగాలను మాత్రం ఆంధ్రప్రదేశ్‌‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో స్థపతులు నిర్మిస్తున్నారని పద్మనాభాచార్యులు పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో పనులు పూర్తయ్యాక అట్లాంటా ప్రాంతానికి విడిభాగాలను విమానంలో తరలిస్తామని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE