Suryaa.co.in

Andhra Pradesh

పింగళి-రంగా పేరు పెట్టాలని బీజేపీ-జనసేన ధర్నాలు

అవనిగడ్డ : మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడనున్న కృష్ణాజిల్లాకు జాతీయ పతాకరూపకర్త పింగళి వెంకయ్య పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయాలని జనసేన, బీజేపీలు అవనిగడ్డ తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టాయి. భారత దేశానికి జాతీయ పతాకాన్ని రూపొందించి తెలుగు వారి కీర్తిపతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేసిన పింగళి వెంకయ్యకు సముచిత గౌరవం దక్కలేదని మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఆయన పేరు పెట్టడం ద్వారానైనా ఆయనకు తగిన గౌరవం కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరును ఖరారు చేయాలని, రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును కూడా ఒక జిల్లాకు పెట్టాలని వారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అవనిగడ్డ రాజీవ్ గాంధీ సెంటర్లో మానవహారం నిర్వహించి అవనిగడ్డ మండల డిప్యూటీ తాహాసిల్దారు మండలి కేశవికి వినతిపత్రం అందజేశారు.

LEAVE A RESPONSE