Suryaa.co.in

Telangana

మర్యాద లేని కుసంస్కారి బీజేపీ ఎంపీ అరవింద్‌

– నీ మొఖానికి దిక్కులేక మోడీ మొహం వాడుకొని రెండు సార్లు ఎంపీ అయ్యావు
– రెండుసార్లు ఎంపీ గా గెలిచి జిల్లా ప్రజలకు నువ్వు చేసింది గుండు సున్నా
– రాజకీయ ఉద్దండులే మట్టి కొట్టుకుపోయారు ఆఫ్ట్రాల్ యాక్సిడెంటల్ ఎంపీ వి నువ్వెంత
– సింహం లాంటి కేసీఆర్ పై గాడిద లాగ గాండ్రిస్తున్న అరవింద్ అహంకారాన్ని ప్రజలు పాతాళానికి తొక్కే రోజు దగ్గరలోనే ఉంది
– 71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలివాడు అయితే 74 ఏండ్లు ఉన్న మోడీ ని ఏమనాలి ?
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ : భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవి అని గత ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉండి,చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తిని విమర్శించడానికి ఎంపీ అరవింద్‌ కు ఏమాత్రం అర్హత, స్థాయి లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు.

తండ్రి వయసున్న కేసీఆర్ పై మరియు తెలంగాణ ఉద్యమకారులైన కేటీఆర్,హరీష్ రావు కవితల పై వ్యక్తిగత హననం చేస్తూ అరవింద్ మాట్లాడిన దిగజారుడు మాటలు ఆయన స్థాయిని సూచిస్తున్నాయి. సింహం లాంటి కేసీఆర్ పై గాడిద లాగ గాండ్రిస్తున్న అరవింద్ అహంకారానికి ప్రజలు తొందరలోనే పాతరేస్తారు. 71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలివాడు అయితే 74 ఏండ్లు ఉన్న మోడీ ని ఏమనాలి ?

అరవింద్ తండ్రి డి.శ్రీనివాస్ రాజకీయంగా సమాధి అనుకున్న సమయంలో మళ్లీ ఎంపీ ని చేసి వెలుగులోకి తెచ్చింది కేసీఆర్. నీ మొఖానికి ఎవరు ఓట్లు వేయరని “నన్ను చూసి కాదు మోడీ ని చూసి బిజెపి కి ఓట్లు వేయండి” అని అడుక్కొని యాక్సిడెంటల్ ఎంపీ అయ్యావు. రెండు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ, జిల్లాకు,నియోజకవర్గ ప్రజలకు అందించిన అభివృద్ధి శూన్యం.

ఎప్పుడు ఇతరులపై మతి లేని మాటలు,బూతు మాటలు మాట్లాడుతూ ..తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం అరవింద్ చేస్తున్నాడు. ఒక్క అంశంపై సరైన అవగాహన ఉండదు..అడ్డగోలుగా ఒర్రడం తప్ప.. ‘బనకచర్ల’ను ‘జనకచర్ల’గా అనడం, ఇరిగేషన్ పై అవగాహన లేకుండా ఈ మధ్య అరవింద్ మాట్లాడిన మాటలు ఆయన విషయ అవగాహన స్థాయి ని ప్రజలకు అర్థమయ్యేలా చేసాయి.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై మాట్లాడకుండా, ఇంకా బీఆర్ఎస్ పార్టీపై నిత్యం విమర్శలు చేయడం ద్వారా బీజేపీ – కాంగ్రెస్ పార్టీ లు ఒకటే అని ప్రజలు గుర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందటం కోసమే బీజేపీ ఎంపీ లు ఇంకా బీఆర్‌ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం నిత్యం పోరాడుతుంటే, బీజేపీ ఎంపీలు మాత్రం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై ఓ మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.

అనేక అంశాల్లో మీ పార్టీ లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ముందు నీ పార్టీ ని సక్కదిద్దుకో. అధికార మదంతో అహంభావంతో విర్రవీగుతున్నావు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

LEAVE A RESPONSE