ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

– సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి పద్మారావు

పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తున్న తనకు సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి భారీ ఆధిక్యతను కల్పించి ఆశీర్వదించాలని, రెట్టించిన ఉత్సాహంతో తాను పని చేసే అవకాశం కల్పించాలని బీ.ఆర్.ఎస్. ఎం పీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని సితాఫలమండీ డివిజన్ లో ని వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచార యాత్రను నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కుమారి సామల హేమ, బీ.ఆర్.ఎస్. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రాజు సాగర్, యువ నేత రామేశ్వర్ గౌడ్, తదితరులతో కలిసి వందల మంది కార్యకర్తలు వెంట రాగా పద్మారావు గౌడ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన తరహాలోనే పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా, కింది బస్తీ, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్, శ్రీనివాస్ నగర్, మహమ్మద్ గూడా, షాబాజ్ గూడా, రెడ్ క్రాస్ హాస్పిటల్, వారసిగూడ, నామాలగుండు, తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం సాగింది. పద్మారావు గౌడ్ కు ప్రజలు హరతులతో స్వాగతం పలికారు.

Leave a Reply