ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నావా ఏ2 రెడ్డి?

-అడ్డగోలుగా భూదోపిడీ చేసిందికాక, పత్తిత్తుకబుర్లతో ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నావా ఏ2 రెడ్డి?
– అవినీతిని బయటపెట్టిన మీడియాపై అక్కసు వెళ్లగక్కడంకాదు.. దమ్ముంటే సీబీఐతో విచారణ జరిపించి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకో.
• అవినీతికేసుల్లో, ప్రభుత్వంలో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి అడ్డగోలుగా బుకాయించినంత మాత్రాన కూతురు, అల్లుడిపేర్లతో బరితెగించి చేసిన భూదోపిడీ కనుమరుగవుతుందా?
• విశాఖ కేంద్రంగా విజయసాయి అండ్ కో సాగించిన రూ.40వేలకోట్ల భూదోపిడీపై విచారణ జరిపి, అసలుదోషుల్ని శిక్షిస్తేనే జగన్ రెడ్డిని ప్రజలు విశ్వసిస్తారు.
• అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అని కారుకూతలు కూశారు…విశాఖ భూదోపీడీపై ప్రశ్నిస్తుంటే సిట్ నివేదికలంటున్నారు.
• జగన్ రెడ్డి మీడియా ఉండగా, సొంత మీడియా పెట్టాలన్న ఆలోచన విజయసాయికి వచ్చిందంటే ఆయన్నెవరో కొట్టరానిచోట కొట్టారనిపిస్తోంది.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

అధికారం లేనప్పుడే అతితెలివితేటతో ప్రజలసొమ్ముని లూఠీచేసిన జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు, ఇప్పుడు ఏమీఎరుగని ఉత్తములంటే ప్రజలెవరు నమ్మేస్థితిలో లేరని, విశాఖ కేంద్రంగా ఏ2, అతనిపరివారం సాగించిన భూదోపిడీని టీడీపీ, మీడియా ఆధారాలతో ప్రజల ముందుంచినా, సిగ్గులేకుండా విజయసాయి పత్తిత్తుకబుర్లు చెబుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే.. “ విజయసాయి దోపిడీకోసమే జగన్ రెడ్డి విశాఖ రాజధాని అన్నాడు. సహజవనరులతోపాటు, రాష్ట్రంలోని విలువైన ఖనిజసంపదసహా దేన్ని వదలకుండా తోడుదొంగలిద్దరూ మెక్కేస్తున్నారు. వారి దోపిడీని తెరమరుగు చేయడానికే మూడురాజధానులపేరుతో కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారు. పూర్తిగాదోచేసి, విశాఖనగరాన్ని చిక్కిశల్యంచేసేవరకు జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నిద్రపోరు. జగన్ రెడ్డి కేసుల్లో ఏ2, ఇప్పుడు ప్రభుత్వంలో నంబర్-2గాఉన్న విజయసాయి విశాఖను అడ్డగోలుగా దోచేశాడు. స్వాహాచేసిన భూముల్ని గుట్టుచప్పుడుకాకుండా బరితెగించిమరీ కూతురుఅల్లుడిపేర్లతో పెట్టాడు. అడ్డగోలుగా బుకాయించి, మీడియాముందు కట్టుకథలు చెప్పినంతమాత్రాన విజయసాయిరెడ్డి చేసిన భూదోపిడీ కనుమరుగవుతుందా? తన కనుసన్నల్లో విశాఖకేంద్రంగా సాగిన దోపిడీని బయటపెట్టిన మీడియాపై బురదజల్లినంత మాత్రానో, విలేకరుల్ని బెదిరించినంతమాత్రానో విజయసాయి పత్తిత్తుఅవ్వడు.

తనకూతురు పుట్టకముందున్న అరబిందోఫార్మాకు ఎన్నడూలేనన్ని భూములు 3న్నరేళ్లలో ఎలా వచ్చాయి? రుషికొండ, ఆచుట్టుపక్కల ఉన్న భూములతోపాటు, పంచగ్రామాల క్రమబద్ధీకరణ పేరుతో రూ.2,500కోట్ల విలువైన భూముల్నివిజయసాయిరెడ్డి కాజేశాడు. భోగాపురం విమానాశ్రయంభూములపేరుతో రూ.400కోట్లు, హెటిరో సంస్థపేరుతో రూ.400కోట్ల ల్యాండ్స్ ని కాజేశాడు. ప్రేమసమాజం స్వచ్ఛందసంస్థకు చెందిన రూ.200కోట్ల భూములుస్వాహా చేయడంతోపాటు, సీబీసీఈసీ చర్చిభూముల్ని దిగమింగి, బేపార్క్ ను కూడా మింగేశాడు. విజయసాయి ముసలోడు కాబట్టే, కొట్టేసిన ఆస్తుల్ని కూతురిపేరుమీద పెట్టాడు. 2022 మార్చి3న హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో ప్రభుత్వానికి తెలియదా? మూడురాజధానులు పెట్టే హక్కు శాసనసభకు లేదని చెప్పలేదా?

హైదరాబాద్ లో కూడా లేనివిధంగా, కొట్టేసిన భూముల్ని విజయసాయిరెడ్డి 70శాతం బిల్డర్లకు, 30శాతం ఓనర్లకు అంటూ పంపకాలు జరపలేదా? గోపీనాథ్ రెడ్డి ఎవరో, అతని సంస్థలో ఎవరు డైరెక్టర్లో విజయసాయికి తెలియదా? భూములు దోచేశాడనే విజయసాయిని తాడేపల్లి నుంచి ఫుట్ బాల్ లా ఈడ్చితన్నారు. ప్రజాక్షేత్రంలో విజయసాయి, వైసీపీప్రభుత్వ అవినీతి, భూదోపిడీ బట్టబయలైంది. ప్రజలకు తెలిస్తే తమను ఎక్కడ పరుగులు పెట్టిస్తారోనన్న భయంతోనే బుకాయింపులు, బుజ్జగింపులపర్వం మొదలెట్టారు. ఆకోవలోనే మూడురాజధానులంటూ ఉత్తరాంధ్ర వాసుల్ని రెచ్చగొడుతున్నారు.

గతంలో దసపల్లా భూములపై సీబీఐ విచారణకోరాలన్న మంత్రి అమర్నాథ్, ఇప్పుడు విజయసాయి కబ్జాలపై నోరెత్తడేం?
రూ.1500కోట్ల విలువైన దసపల్లా భూములరక్షణకు టీడీపీప్రభుత్వంలో దీక్షలుచేసిన మంత్రి అమర్నాథ్ ఇప్పుడేమో ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తానంటూ ఏ2 దోపిడీకి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. విశాఖకేంద్రంగా విజయసాయి సాగించిన భూదోపిడీపై సీబీఐ విచారణ కోరమని ముఖ్యమంత్రిని అడిగే ధైర్యం అమర్నాథ్ కు ఉందా? టీడీపీప్రభుత్వంలో ఈగవాలకుండా కాపాడిన భూముల్ని 3న్నరేళ్లలోనే లూఠీచేశారు. మంత్రులు అమర్నాథ్, బొత్స, సీదిరి అప్పలరాజు, ధర్మానలకు నీతినిజాయితీ ఉంటే విశాఖ, ఉత్తరాంధ్రలో సాగిన విజయసాయిరెడ్డి భూదోపిడీపై తేల్చాలి.

దానిపై మాట్లాడే ధైర్యంలేదుగానీ, తామేదో రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తున్నట్లు ప్రజల్ని మోసగించాలని చూస్తున్నారు. 40వేలకోట్ల భూములుకొట్టేసిందికాక, తగుదనమ్మా అంటూ తప్పించుకోవాలని చూస్తారా? ప్రాంతీయవిద్వేషాలు రెచ్చగొట్టకుండా జగన్ రెడ్డి ఇప్పటికైనా ప్రభుత్వభూములు కాపాడి, తనపార్టీలోని దోషుల్ని శిక్షించాలి. విశాఖసహా, ఉత్తరాంధ్రలో సాగిన దోపిడీలో ముఖ్యమంత్రికి ఎంతవాటా అందిందో తెలియదుగానీ, ప్రజలమధ్య కలహాలు పెట్టకుండా ప్రభుత్వభూములుకాపాడితో చరిత్రలో నిలిచిపోతాడు.

భూదోపిడీపై వేసిన సిట్ దర్యాప్తు ఏమైంది…సదరు నివేదికను ఎందుకు బయటపెట్టడంలేదు? విజయసాయి విశాఖ ఇన్ ఛార్జ్ గా వెళ్లాక కనీవినీ ఎరుగనివిధంగా 70వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని కారుకూతలు కూసినవారు, ఇంకెన్నాళ్లు బోగస్ కబుర్లు చెబుతారు? విశాఖలో విజయసాయి, వైసీపీనేతలు సాగించిన భూకబ్జాలతోపాటు, గతప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఎలాంటి విచారణ జరిపినా తమకు వచ్చిన నష్టం లేదు.

అవినీతిపరులు పత్రికలు, ఛానెళ్లు పెట్టడంలో ఆశ్చర్యమేముంది?
విజయసాయి లాంటి అవినీతిపరులు టీవీఛానెళ్లు పెట్టడం, పత్రికలు పెట్టడంలో ఆశ్చర్యంలేదు. జగన్ రెడ్డి సొంతమీడియా ఉండగా, మరోమీడియా ఏర్పాటుచేయాలన్న ఆలోచన విజయసాయికి వచ్చిందంటే ఆయన్ని ఎవరో కొట్టరానిచోట కొట్టారనిపిస్తోంది. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఏపదవులు లేనప్పుడే జైల్లోఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, అది, ఇదీఅని లేకుండా ఏదైనా చేయగలరు. ఒక్కఛాన్స్ అని అడిగినందుకు నమ్మిన ప్రజలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అధికారం అండతో, అహంకారంతో రెచ్చిపోతూ ఇప్పుడు చేస్తున్న దోపిడీకి కూడా ఏ1, ఏ2, మరికొందరు ప్రబుద్ధులు భవిష్యత్ లో కృష్ణజన్మస్థానానికి వెళ్లకతప్పదు” అని ఉమామహేశ్వరరావు తేల్చిచెప్పారు.

Leave a Reply