Suryaa.co.in

Features

శ్వాస ప్రాధాన్యత

మనిషి నిమిషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు.

100 నుండి 120 సం.౹౹లు బ్రతుకుతాడు.

తాబేలు నిమిషానికి “3 సార్లు శ్వాస” తీస్తుంది. 500 సం. లు బ్రతుకుతుంది.

ఐతే “శ్వాస”లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.?

దీనిని సశాస్త్రీయంగా వివరిస్తాను. అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.

మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వీటినే సెల్స్ అంటాం.

ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా (హరిత రేణువు) “అనే ప్రత్యేక కణ వ్యవస్థ”ఉంటుంది.

ఈ మైటోకాండ్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది.

ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తోంది. ఇలా శరీరం లోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది.

ఇలా ఒక్కొక్క కణం నిముషానికి…15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.

ఎందుకంటే మనం నిముషానికి “15” సార్లు శ్వాస తీసు కుంటాం కాబట్టి… ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది.

ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.

ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో…ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది.

ఉదాహరణకు మన గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి. అనుకుంటే…ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్ము. మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమేఆ స్థలం లో కణాలు తయారవు తాయి.

పాత వాటిని ఖాళీ చేస్తేనే…కొత్తవి రాగల్గుతాయి.

అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్య మైనది.

ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో…వారి శరీరం నిండా ఈ మృతకణాలు (toxins) నిండిపోయి… సరిగా ఉష్ణం జనించక……తీవ్ర రోగాల బారిన పడతారు.

కనుక ఈ టాక్సిన్ లను …బయటికి పంపే డిటాక్సీఫీకేషన్..(విసర్జన) చాలా ముఖ్యం.

ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది.

అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే…5 రోజులు జీవిస్తుంది.

13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే..7 రోజులు జీవిస్తుంది.

ఈ విధం గా మనం.. శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ…మన కణాలు పని చేసే కాలం పెరుగుతుంది.

ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే…త్వరగా పాడై పోతుందో పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పని చేస్తుందో అలాగే ఈ కణాలు కూడాను.

భారతీయ యోగులు …కణం యొక్క జీవిత కాలాన్ని…3 నుండి 21 రోజుల వరకు… పెంచి…2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసు కునే కొద్దీ…శరీరంలోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి…ఆ కణం త్వరగా పాడైపోతుంది.

ప్రాణాయామ సాధన ద్వారా “శ్వాస”ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే….మన శరీరం లోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది.

ఎందుకంటే….అవయవాలు “అంటే”…కణాల సముదాయమే.

ఇలా మన లోని ప్రతీ అవయవం యొక్క…ఆయుష్షు పెరిగితే..మన ఆయుష్షు కూడా పెరిగి నట్టే కదా?

మనం ఒక్క “శ్వాస,ను తగ్గించ గల్గితే…20 సంవత్సరాల ఆయుష్షును…పెంచు కోవచ్చు.

యోగులు…ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే…తాము… ఏ రోజు… మరణించేదీ… ముందే చెబుతారు.

LEAVE A RESPONSE