Suryaa.co.in

Telangana

రైతులకు నష్టం వాటిల్లితే మేం వెళ్లలేదా ?

– మీరు ఎందుకు పరిశీలించడం లేదు?
– తెలంగాణా ప్రజలతో బీఆర్ఎస్ ది పేగుబంధం
– పెద్దపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత,

పెద్దపల్లి: తట్టా, చెమ్మాస్ కింద పడేస్తామని నాడు సింగరేణి కార్మికులు చేసిన హెచ్చరికతో తెలంగాణా ఇచ్చే ఆలోచనతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 160 నుంచి 170 పార్టీలు వచ్చి పోయినై. కానీ, 25 ఏళ్లుగా బీఆర్ఎస్ తెలంగాణా ప్రజల గుండె చప్పుడైంది.

తెలంగాణా ప్రజలతో బీఆర్ఎస్ ది పేగుబంధం. ప్రతీ ఏటా ప్లీనరీలు జరుపుకుంటున్నా, ఈ రజోతత్సవ సభ ప్రత్యేకమైంది. గత 25 ఏళ్లుగా జరిగిన ఉద్యమ, బీఆర్ఎస్ పాలనా కాలాన్ని ఓసారి ప్రజలంతా నెమరువేసుకునేలా ఈ సభ ఉండబోతోంది. బీఆర్ఎస్ అస్తిత్వాన్ని ఒకపక్క కాపాడుకుంటూనే.. ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులనూ మనం పరశీలిస్తూ ముందుకెళ్లాల్సి ఉంది. వాటిని ప్రజల ముందు ఎండగట్టాలి.

రైతుబంధును నీరుగార్చి రైతులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అకాలవర్షాలకు ధాన్యం నాని, మామిడి రాలి రైతులు నష్టబోతుంటే ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు వారిని ఆదుకుంటామని ఒక్క ప్రకటన ఎందుకు చేయడం లేదో చెప్పాలి. మా బీఆర్ఎస్ హయాంలో రైతులకు నష్టం వాటిల్లితే మేం వెళ్లలేదా ? మీరు ఎందుకు పరిశీలించడం లేదు?

కేసీఆర్ ఇచ్చిన 80 వేల ఉద్యోగాల నోటిఫికేషన్స్ లోంచి 50 వేల ఉద్యోగాలిచ్చి మేమేదో కొత్తగా చేశామన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఉద్యమ కాలం నుంచి తెలంగాణా వచ్చాక కూడా, జై తెలంగాణా అనని ముఖ్యమంత్రి ఉండటం, మంత్రివర్గం ఉండటం మన దురదృష్టం.

జై సోనియమ్మ అనుడే తప్ప జై తెలంగాణా వాళ్ల నోళ్లల్లోంచి రాదు. అది రానంతసేపు వారు తెలంగాణా గురించి ఆలోచించరు. భట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణిని కేంద్రం కాళ్ల ముందు పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ను చూసినప్పుడు ఏదేమైనా ఇంటిపనికైనా ఒంటిపనికైనా మనోడుండాలనిపిస్తోంది.

పెద్దపల్లి జిల్లా ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసింది. తెలంగాణ అంటే ప్రేమ వున్న ప్రతి ఒక్కరు వరంగల్ సభకు రావాలి. చరిత్రలో నిలిచిపోయేలా, తెలంగాణ కుంభమేళగా సభ జరగనుంది. వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే స్తితికి తెచ్చారు కాంగ్రెస్ పార్టీ .

గ్రూప్ 1 రద్దు చేయాలి. కేసీఆర్ జీఓ 55 తెస్తే, కాంగ్రెస్ 29 తెచ్చి యువకుల పొట్టకొడుతున్నారు. తెలంగాణ పోరాటమే స్థానికత కానీ కాంగ్రెస్ మళ్ళీ నాన్ లోకల్ తెస్తుంది. జిల్లాకో పెట్రోల్ బంకు తో వచ్చే లాభమెమీ లేదు. కేసీఆర్ వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. 8+8 ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒక్క రూపాయి రాలేదు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే. వచ్చే ఎన్నిక ఏదైనా బీ ఆర్ ఎస్ దే విజయం.

LEAVE A RESPONSE