Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి

-మోదీ కి రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా?
-తెలంగాణ నిధుల కోసం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు?
-కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్ళకు పోయినట్లుంది
-సిరిసిల్ల చేనేత కార్మికులకు కేటీఆర్ 275 కోట్లు ఉద్దెర పెట్టి పోయాడు
-సిరిసిల్ల జన జాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఆలస్యం అయినా సిరిసిల్ల వెళ్లాల్సిందేనని వచ్చిన. కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న వినోద్ రావు అపర మేధావి, బండి సంజయ్ అరగుండు మేధావి. కరీంనగర్ జిల్లా కు బీఆర్ఎస్ పదేళ్లు ద్రోహం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ , గిరిజన యూనివర్సిటీ , ఐఐటీ, ఐఐఎం లాంటివి పెట్టింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ హక్కులను పట్టించుకోలేదు. పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా ఇవ్వలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో బిల్లా రంగాలను బండకేసి కొట్టారు. బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి..
డిసెంబర్ లో జరిగిన సెమీ ఫైనల్స్ లో బిల్లా రంగా ను ఓడించాం…ఫైనల్స్ లో మోదీ, అమిత్ షాను ఓడించాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను బొంద పెట్టాం.. బీజేపీ ఢీ కొట్టాలి. తెలంగాణకు రావాల్సిన హక్కులు. నిధులు ఇవ్వకుండా ప్రధాని మోదీ అవమానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మోదీ అవమానించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటు పార్లమెంట్ సాక్షిగా మోదీ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానించిన మోదీ కి రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా?

కోనసీమ నుంచి చిత్రసీమ వరకు అన్నీ ట్విట్టర్లోనే ట్విట్టర్ టిల్లు మాట్లాడతడు. రిజర్వేషన్ల రద్దుకు మోదీ ప్రయత్నిస్తుంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు..? 2022 పిబ్రవరిలో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని,రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటోంది.. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటుంటే చూస్తు ఊర్కుకుందామా? బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదు.

కారు కార్ఖానా కు పోయింది.జుమ్మేరాత్ బజార్ లో అమ్మాల్సిందే. కేసీఆర్ బస్సు యాత్ర చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్ళకు పోయినట్లుంది. బీజేపీ కి 400 సీట్లు వస్తాయని పరోక్షంగా కేసీఆర్ చెపుతున్నడు. బీఆర్ఎస్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాలితే కాల్చిపారేస్తాం. కారు గుర్తు వాన్ని మా గల్లీలో కూడా అడుగుపెట్టనివ్వం. ఎన్నికల తర్వాత బీజేపీ తో కలిసి పోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఒకటో రెండో గెలిస్తే మోదీకి అమ్మేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

రైతు నల్లచట్టాలతో పాటు బీజేపీ తీసుకువచ్చిన బిల్లులకు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ అభ్యర్థి వినోద్ రావు ప్రచారం చేయకుండా ఎందుకు ఇంట్లో పడుకున్నాడు. బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్ ల దగ్గర తాకట్టు పెడుతున్నాడు. తెలంగాణ నిధుల కోసం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు.? పదేళ్లు అన్యాయం చేసిన మోదీకి వ్యతిరేకంగా ఎందుకు కార్యక్రమాలు తీసుకోవడం లేదు?

40 కోట్ల ఆడబిడ్డలు ఆర్టీసీ లో ఉచితంగా ప్రయాణం చేశారు. మోదీ, కేసీఆర్ సిలిండర్ ను 1200 రూపాయలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 500 వందలు చేసింది నిజం కాదా? 60 లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. 22వేల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. మూడు నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కళ్లలో ఆనందం చూడలేదా.?

మా ప్రభుత్వాన్ని దించాలని మోదీ, కేడీ కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ ను వదిలించాం. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల కు పట్టిన పీడ వదిలించాలి. సిరిసిల్ల చేనేత కార్మికులకు కేటీఆర్ 275 కోట్లు ఉద్దెర పెట్టి పోయాడు. నేతన్నలను ఆదుకోవడానికి తక్షణమే 50 కోట్లు విడుదల చేశాం.

పదేళ్లు అధికారంలో ఉండి మిడ్ మానేరు ముంపు బాదితులను కేసీఆర్ పట్టించుకోలేదు. గాలికి వచ్చి గాలికి పోతారని అనుకుంటున్నారేమో.. కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడి ప్రభుత్వాన్ని తెచ్చారు.. బిడ్డా.. దిగు అంటే తొక్కుతం. నల్లమల అడవుల నుంచి తొక్కుకుంటూ వచ్చిన. పేదలను ఆదుకునేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విద్యావంతుడు.. పార్లమెంట్ లో ఉండాలి. తెలంగాణ కు అరగుండు, గుండు కలిసి గాడిద గుడ్డు తెచ్చారు. తెలంగాణ కు బీజేపీ కి ఇచ్చింది గాడిద గుడ్డు.

LEAVE A RESPONSE