Suryaa.co.in

Andhra Pradesh

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుగడ్డపైనే పుడతా

– బందిపోటుకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్దం
-ఇవి ధర్మం, అధర్మం, విధ్వంసం-అభివృద్ధికి జరిగే ఎన్నికలు

-సైకో మళ్లీ వస్తే రాష్ట్రానికి ప్రజలకు భవిష్యత్తు ఉండదు… ఆస్తులకు రక్షణ ఉండదు
-ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనే రెండవ సంతకం
-ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాది
-నెల్లూరు-తిరుపతి-చెన్నైని ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం
-నెల్లూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. విధ్వంసకారుడు, బందిపోటు దొంగ రాష్ట్రంలో ఉన్నాడు. విధ్వంసకారుడిని తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారా? యువత భవిష్యత్ నాదీ భాద్యత, పవన్ ది బాధ్యత. ఈ ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలుస్తాం. రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు జాతి అభ్యున్నతి కోసం సైకోను రాష్ట్రం నుంచి సాగనంపాలి. ఇవి ధర్మం, అధర్మం, విధ్వంసం-అభివృద్ధికి జరిగే ఎన్నికలు. జగన్ అహంకారానికి ప్రజల ఆశలకు మద్య జరుగుతున్న ఎన్నికలు. రాతియుగం పోవాలి.. స్వర్ణయుగం రావాలి.

బందిపోటుకు, ఐదు కోట్ల ప్రజానీకానికి జరిగే ఎన్నికలు. రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమవుతున్నాయి. ఉద్యోగులంతా 100 కి 100 శాతం ఎన్డీయే కూటమి అభ్యర్దులను గెలిపించాలి. డబ్బులతో, కుట్రతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వందల కోట్లు ఖర్చు చేసినా మీరు వైసీపీ ఓటేస్తారా? మీకు ఎంత ఇచ్చినా అవన్నీ మీ డబ్బులే. ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ లో దోచుకున్నవే. మీకు రూ. 10 ఇచ్చి రూ. 100 కొట్టేస్తున్నారు.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనే రెండవ సంతకం
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి? జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువచ్చారు. ఈ చట్టం వస్తే పట్టాదారు పాసు పుస్తకం ఉండదు.. పత్రాలు ఉండవు. భూముల రికార్డులన్నీ ఆన్ లైన్ లోనే ఉంటాయి, ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా జగన్ అనుమతి కావాలి. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఎందుకు? దుర్మార్గుడు మళ్లీ గెలిస్తే ప్రజలకు భవిష్యత్తు లేదు.. ఆస్తులకు భద్రత లేదు. అధికారంకలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైన, రెండవ సంతం ల్యాంట్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పైనా పెడతా.

ముస్లింల రిజర్వేషన్లు కాపాడే బాద్యత నాది
ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడుతాం. ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తాం. ముస్లింలకు హజ్ హౌస్ నిర్మిస్తాం. మక్కా యాత్రకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తాం. రంజాన్ తోపా, దుల్హన్ పునరుద్దరిస్తాం. మౌజన్, ఇమాం లకు గౌరవ వేతనం పెంచుతాం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పొత్తుకు ముందుకొచ్చారు. రాష్ట్రం కోసం మూడు పార్టీలు త్యాగం చేశాయి. రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అయింది, ప్రజలు గెలబోతున్నారు, రాష్ట్రం నిలుస్తుంది పిల్లల భవిష్యత్తు బంగారమయం అవుతుంది.

జగన్ కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తాం
మేము వస్తే సంక్షేమ పధకాలు రద్దవుతాయని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ ఇచ్చేది రూ. 10 దోచేది రూ. 100. మేం ఆదాయం పెంచి సంక్షేమం ఇస్తాం. ఆడబిడ్డకి ప్రతి నెల రూ. 1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా…ఒక్కొక్కరికి రూ. 15000 ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. కూటమి వచ్చాక మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తాను.

ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నెలకు నిరుద్యోగ యువతకు రూ. 3 వేలు భృతి అందజేస్తాం. రైతును రాజుగా చేస్తాం. ఏప్రిల్ నుంచి 4 వేల పింఛన్ అందజేస్తాం. దివ్యాంగులకు రూ. 6 వేల పింఛన్ అందజేస్తాం. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. లక్షన్నర మంది సచివాలయం సిబ్బందితో పింఛన్లు ఇవ్వవచ్చు. పింఛన్ల పేరుతో 33 మంది వృద్ధులను చంపేశారు. పింఛన్లు బ్యాంకుల్లో జమ చేసి వృద్ధులకు ఇబ్బంది పెట్టారు.

చంద్రన్న భీమా కింద ప్రమాధ మరణానికి రూ. 10 లక్షలు, సహజ మరణానికి రూ. 5 లక్షలిస్తాం. ఆర్యోగ భీమా ప్రతి ఒక్కరికి రూ. 25 లక్షలిస్తాం. నాయి బ్రాహ్మణులకు న్యాయం చేస్తాం. కూటమి వచ్చాక బీసీ డిక్లరేషన్ తీసుకువస్తాం. బీసీలకు ఐదేళ్లలో రూ. 1.5 లక్షల కోట్లు ఖర్చు పెడతాం. కాపుల సంక్షేమానికి రూ. 15 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టాం. క్రిష్టియన్లు సంక్షేమం కూడా చూస్తాం. రవాణ రంగ డ్రైవర్లకు ఏడాదికి రూ. 15 వేలిస్తాం. యువతకు చేయూతనిచ్చి బంగారు భవిష్యత్తు ఇస్తాం. స్కిల్ గణన చేసి యవతకు శిక్షణ ఇస్తాం.

వేమిరెడ్డికి విజయాసాయిరెడ్డికి పోలికా
పవన్ రాజకీయాల్లో స్ట్రగుల్ అయ్యాడు, పోరాడాడు, నిలదొక్కుకున్నాడు. అది జీవితం నేర్పిన గుణపాఠం సరైన సమయంలో సరైన నిర్ణయం ముందుకు తీసుకెళ్తుంది. నారాయణ సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. వేమిరెడ్డికి, విజయసాయిరెడ్డికి ఏమైనా పోలికా? నెల్లూరును దోచుకోవడానికే విజయసాయిరెడ్డి వచ్చారు. జగన్ అరాచకాలకు రాష్ట్రం నాశనమైతుందని తిరుగుబాటు చేసిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వెంటబడి వేధించినా, కేసులు పెట్టినా శ్రీధర్ రెడ్డి, నారాయణ రెడ్డి పోరాడారు.

నెల్లూరు-తిరుపతి-చెన్నైని ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం
నెల్లూరు-తిరుపతి-చెన్నైని ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతాన్ని హార్ట్ వేర్, ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతాం. టిడ్కో ఇళ్లకు వైకాపా రంగులు వేసుకున్నారు. కూటమి వచ్చాక 48 వేల ఇళ్లు అర్హులకు అందజేస్తాం. నెల్లూరులో ఇంటి జాగా లేని ప్రజలకు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. నారాయణ మంత్రిగా ఉన్నపుడు నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ. 525 కోట్లు ఖర్చు చేశారు. రూ. 735 కోట్లతో సీసీ రోడ్లు వేశాం. రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా జరిపారు. కాపుభవన్, బీసీ భవన్ , అంబేద్కర్, బాబు జగజ్జీనవ్ భవనాలు, ఘోశా ఆస్పత్రి, మైనార్టీ బాలికల కళాశాల, చేపల మార్కెట్, మటన్ మార్కెట్ నిర్మించారు.

మున్సిపల్ పాఠశాలను అభివృద్ది చేశారు. 7 అన్న క్యాంటీన్లుతో పేదల ఆకలి తీర్చారు. నెల్లూరు జిలా అభివృద్దికి రూ 5,200 కోట్లు ఖర్చు చేసిన వ్యక్తి నారాయణ. వైసీపీ పాలనలో ఒక్క రూపాయి ఖర్చు చేశారా? నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డిని, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు

LEAVE A RESPONSE