గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని విజయసాయి ట్వీట్ చేయగలడా?

  • ’’గంటరా సంజనా’’ అని అన్న అంబటి రాంబాబు కి జగన్ మంత్రి పదవి ఇచ్చాడు
  • ‘‘అరగంట రా, అరగంటలో పంపించేస్తాను’’ అని అమ్మాయితో చెప్పిన అవంతి శ్రీనివాస్ కి మంత్రి పదవి ఇచ్చాడు
  • మహిళా వాలంటీర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చాడు
  • విజయసాయి చేసేవన్నీ అసాంఘిక కార్యకలాపాలే
  • మాధవ్ పై ఎన్నికల అఫిడవిట్ లో హత్యాయత్నం కేసులున్నాయి
  • అమ్మాయిలను వీడియోల ద్వారా బెదిరిస్తుంటే విజయసాయి.. నీవు ఏం చేస్తున్నావ్?
  • దేవేందర్ రెడ్డి పేటీఎం కుక్కలతో ట్వీట్లు చేయడం మానాలి
  • మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

వైసీపీ ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఛోటా మోటా వైసీపీ నాయకుల తీరు అసహ్హించుకొనేలా ఉంది. సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నాయకులు నిసిగ్గుగా వ్యవహరిస్తున్నారు. హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ మహిళపై లైంగికవేధింపులకు గురిచేస్తున్న న్యూడ్ వీడియో వైరల్ అవుతున్నా.. గోరంట్ల మాధవ్ బుకాయించడం ఎంతవరకు సమంజసం?

గుడ్డలు వూడతీసుకొని ఎవరైనా జిమ్ చేస్తారా? చెప్పడానికి కూడా వీలుకాని విధంగా వ్యవహరించాడు. పూర్తి నగ్నంగా తయారై అచ్చోసిన ఆంబోతులా వ్యవహరించాడు. గోరంట్ల మాధవ్ చేసింది తప్పు, అతనిపై చర్యలు తీసుకొండని విజయసాయి ట్వీట్ చేయగలడా? గోరంట్ల మాధవ్ పై ఎన్నికల అఫిడవిట్ లో సెక్షన్ 376, అత్యాచారం, సెక్షన్ 302, 506 హత్యాయత్నం కేసులున్నాయి.

వైసీపీ ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఛోటా మోటా వైసీపీ నాయకులు రెచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. గతంలో అంబటి రాంబాబు ‘‘సంజన అనే అమ్మాయిని బ్లూ జీన్స్ వేసుకొని గంటరా సంజనా’’ అని అన్న వీడియో అందరం చూశాం. అలాంటివాడికి జగన్ మంత్రి పదవి ఇచ్చాడు.

అవంతి శ్రీనివాస్ ‘‘అరగంట రా, అరగంటలో పంపించేస్తాను’’ అని అమ్మాయితో చెప్పిన ఆడియో కూడా వైరల్ అయింది. జోగి రమేష్ పెడనలో మద్యం సేవించి, మహిళా వాలంటీర్లను లైంగిక వేధింపులకు గురిచేసినా జగన్ అతనికి మంత్రి పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ టీడీపీ చేసిన ఆరోపణలు కావు. వారు మాట్లాడినవే.

జగన్ రెడ్డి సమాజంలో ఎటువంటి వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు ఇస్తున్నాడో దీన్ని బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. బయటికి వస్తే అచ్చోసిన ఆంబోతుల్లా వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, మందుబాబుల నుండి తప్పించుకొని బయటికి వచ్చిన మహిళలు, గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తుల నుండి తప్పించుకోలేకపోతున్నారు. జగన్ గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తుల వెంట్రుక కూడా జగన్ పీకలేడు. విజయసాయి విషయానికొస్తే విజయసాయి చేసేవన్నీ అసాంఘిక కార్యకలాపాలే. గుండెపోటు అని, లేదు లేదు మర్డర్ అని ఏదైనా చెప్పగలిగే వ్యక్తి విజయసాయి.

తోటి పార్లమెంట్ సభ్యడు డిల్లీలో నగ్నంగా అమ్మాయిలను వీడియోల ద్వారా బెదిరిస్తుంటే విజయసాయి.. నీవు ఏం చేస్తున్నావ్? దీనికి గతంలోనే నీకు 18 నెలలు జైలుశిక్ష పడినా విజయసాయి బుద్ధి మారలేదు.
చీడపురుగు లాంటి లక్ష్మీపార్వతికి మచ్చ లేని ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ల గురించి మాట్లాడుతోంది. ఇలాంటి పనులు చేసినందుకే ఆనాడు అందరూ కలిసి తన్ని తరిమేసిన విషయం లక్ష్మిపార్వతి గుర్తు చేసుకోవాలి. ఎన్టీ రామారావు కుమార్తె ఉమామహేశ్వరి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూశారు. దేవేందర్ రెడ్డి పేటీఎం కుక్కలతో ట్వీట్లు చేయడం, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం మానాలి. జగన్ బాబాయిని చంపి మూడు సంవత్సరాలైంది. ఇప్పటికైనా హంతకులను జగన్ పట్టుకోవాలని, గోరంట్ల మాధవ్ పై ఏం చర్యలు తీసుకోబోతున్నారో జగన్ సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కోరారు.

Leave a Reply