Suryaa.co.in

Andhra Pradesh

కులాలు, మతాలు కూడు పెట్టవు

-ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో నిరూపిస్తా
-రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సుజనా చౌదరి

విజయవాడ: కులాలు, మతాలు కూడు పెట్టవని, భావితరాలు పైకి రావడానికి, పేదరికాన్ని జయించడానికి కేంద్రం అనేక పథకాలు ఇచ్చిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. మాజీ కార్పొరేటర్ అలుగుండ్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఊర్మిళా నగర్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

వైసీపీ అరాచకపాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని సుజనా చెప్పారు. సమర్థుడైన నాయకుడు, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపాలనే ధ్యేయంతో ముందుకు వస్తున్నానని సుజనా వివరించారు. నాయకత్వ లోపంతో, రాజకీయ కారణాలతో ఇప్పటివరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఈ అయిదేళ్ళలో జగన్ పాలనలో ఒక్క మంచి పని కూడా జరగలేదన్నారు.

ప్రజలు ఓడిస్తారని తెలిసే నియోజకవర్గ ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు-మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు, వి వెంకటేశ్వర రెడ్డి , 43వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొనికి కొండయ్య, బీజేపీ నాయకులు విశ్వేశ్వరరావు, జనసేన నేత కోటి, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE