ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్‌కు మాక్లుర్‌లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు…

Read More

కోర్టు ప్రాంగణంలోనే ఖైదీపై కాల్పులు.. దారుణ హత్య

బిహార్‌ లోని ఓ కోర్టులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ అండర్‌ ట్రయల్‌ ఖైదీని దుండగులు న్యాయస్థానం ప్రాంగణంలోనే కాల్చి చంపారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పట్నాలోని దనాపుర్‌ కోర్టు లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్‌ శర్మ సోదరుడి హత్య కేసులో చోటే సర్కార్‌ అనే వ్యక్తి అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్నాడు. ఈ…

Read More

రైళ్లలో నకిలీ టీటీఈల గుట్టురట్టు.. తెనాలి కేంద్రంగా రైల్వేలో వసూళ్లపర్వం!

రైళ్లలో టీసీల పేరుతో కొందరు దొంగలు కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. టికెట్‌లేని ప్రయాణికులే వీరి టార్గెట్‌. మెడలో నకిలీ రైల్వే ఐడీ కార్డు, నకిలీ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్‌ కలెక్టర్‌లా మాట్లాడుతూ టికెట్‌ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ పెద్దమొత్తంలో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు వరకు రైళ్లలో సంచరిస్తూ కొన్ని రైళ్లలోనే ఈ రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ జరిమానాలు విధిస్తూ ప్రయాణికులను…

Read More

మహిళ ఇంట్లో 3 కోట్ల నగదు లభ్యం

– పోలీసులు, ఐటీ మెరుపుదాడి – అవి పొంగులేటి కంపెనీవే – ముగ్గురిపై కేసు నమోదు ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఓటర్లకు డబ్బు పంచేందుకు ఖమ్మం రూరల్ మండల పరిధి, వరంగల్ క్రాస్ రోడ్డులోని శ్రీరామ్ నగర్‌, ఇంటి నెంబర్ 6-156/7/1 లో భారీ మొత్తంలో నగదు ఉంచినట్లు సమాచారంతో ఆదివారం రాత్రి 23:40 గంటల సమయంలో పోలీస్ టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంతో ఆ ఇంటికి వెళ్లగా, వారిని గమనించిన ఇద్దరు వ్యక్తులు…

Read More

గంజాయి తోటలపై మెరుపు దాడులు

– రెండు రోజుల్లో 64 ఎకరాల పంట ధ్వంసం అల్లూరి జిల్లా ఏజెన్సీలో గంజాయి నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. గిరిజనుల్లో గంజాయి అనర్ధాలపై అవగాహన కల్పిస్తూనే.. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి తోటలు ఉంటే స్థానికుల సహకారంతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. రెండు రోజుల్లో పాడేరు ఏజెన్సీలో 64 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు, అల్లూరి జిలా పాడేరు ఏజెన్సీలో…

Read More

పైన ఇటుకలు..లోపల గంజాయి .. పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా!

మంచిర్యాల : పుష్ప సినిమా తరహాలో కొందరు స్మగ్లర్లు అతి తెలివి ఉపయోగిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు అంతు చి క్కని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు. తాజాగా రాత్రి మంచిర్యాల జిల్లాలో కొందరు దుండగులు పైన ఇటుకలు..లోపల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడడంతో అసలు నిజం బయటపడింది. ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి గంజాయి తరలింపు కోసం కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని ట్రాక్టర్ లో ఉంచి పైన సిమెంట్…

Read More

‘పుష్ప’ సీన్ రిపీట్…

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ‘పుష్ప’ సినిమా సీన్ రిపీట్ అయింది. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేసినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. రూ.కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు.

Read More

పూణేలో తెలంగాణ వాసుల అరెస్టు

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.పూణేలో భారీగా డ్రగ్స్ పట్టుపడింది. ఐదుగురి వద్ద రూ.51 కోట్ల విలువ చేసే 101 కేజీల మెథాక్వాలోన్‌‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ టూ పుణే జాతీయ రహదారిపై మాటు వేసి మరీ డ్రగ్స్‌ను ముఠాను డీఆర్‌ఐ బృందం పట్టుకుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణలో ఎక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నారని దానిపై విచారణ చేపట్టారు….

Read More

హెయిర్ క్లిప్పుల రూపంలో బంగారం రవాణా

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు. హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు…

Read More

కాలేజీ విద్యార్థినిపై మాజీ క్లాస్‌మేట్ కత్తితో దాడి

పూణెకు చెందిన ఓ 19 ఏళ్ల యువతిపై 21 ఏళ్ల మాజీ క్లాస్‌మేట్ కత్తితో రోడ్డుపై పరుగెత్తించి దాడికి మంగళవారం పాల్పడ్డాడు. అదే సమయంలో అటు నుంచి బైక్ వెళుతున్న స్థానికులు.. అతడిని వెంబడించి యువతిని దాడి నుంచి రక్షించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో యువకుడు యువతి వెంటపడి దాడి చేయడం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని…

Read More