– రేవంత్ రెడ్డి బీజేపీ చేతిలో కీలుబొమ్మ.. తోలు బొమ్మ
– బండి సంజయ్ చెప్పడంతోనే రేవంత్ రెడ్డి సిబిఐకి ఇచ్చారు
– రేవంత్ రెడ్డి, మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి కేసీఆర్ పై కుట్ర
– ఎస్.ఎల్.బి.సి టన్నెల్ కూలడంపై సీబీఐ విచారణ చేయాలి
– పోలవరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేస్తారా?
మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీ ఆర్ ఎస్ విప్ కె.పి.వివేకానంద
హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్,బీజేపీ బంధం బయటపడింది. రేవంత్ రెడ్డి, బీజేపీ బంధం మరోసారి రుజువు అయింది. అసెంబ్లీలో హరీష్ రావు ప్రసంగాన్ని సీఎం, మంత్రులు 33 సార్లు అడ్డుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద చల్లుతోంది. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కు అవకాశం ఇచ్చి హరీష్ రావు ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
37 మంది సభ్యులు ఉన్న బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సభ్యుడుకి అవకాశం ఇచ్చారు. 80 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. 8 మంది సభ్యులు ఉన్న బీజేపీ నుంచి ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. 90 నిమిషాలు బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టును పాల్వాయి హరీష్ చదివారు.
బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ ను తిడుతూ అసెంబ్లీలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి,బండి సంజయ్ కలిసి పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ కు చెప్పడంతోనే కేంద్రం ఎన్.డి.ఎస్.ఏ వచ్చింది. వారం రోజుల్లోనే రిపోర్టు ఇచ్చింది. మోడీ ఎన్.డి.ఎస్.ఏ ను పంపి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి సహాయం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరికి ఒకరు సహకారం చేసుకుని కాంగ్రెస్,బీజేపీ చెరో 8 సీట్లు గెలిచారు.
ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, హడావిడిగా అసెంబ్లీ పెట్టి ఘోష్ కమీషన్ రిపోర్టు అని అంటున్నారు. రిపోర్టు సీల్డ్ కవర్ లో ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడు ఘోష్ రిపోర్టుపై మాట్లాడతారు.అసెంబ్లీ ఒక్కరోజు మాత్రమే పెట్టారు. కాళేశ్వరం లో మేడిగడ్డ బ్యారేజీ అనేది చిన్న సమస్య.
రేవంత్ రెడ్డి మీదకు మోడీ ఎన్.డి.ఎస్.ఎ ను ఎందుకు పంపడు? కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు మీదకు ఎన్.డి.ఎస్.ఏ, సీబీఐ వస్తుంది. బండి సంజయ్ చెప్పడంతోనే రేవంత్ రెడ్డి సిబిఐకి ఇచ్చారు కాళేశ్వరం ను సీబీఐకి ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. కేసీఆర్ ను బద్నాం చేయడం ఒక కుట్ర. కాళేశ్వరం పై సీబీఐ విచారణ వేయడం అంటే కాళేశ్వరం ను ఎండబెట్టే కుట్ర.
బనకచర్ల,కావేరీ నదీ జలాల లింక్ ప్రాజెక్టును బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారు. సీబీఐ విచారణ పేరుతో పర్మినెంట్ గా మేడిగడ్డను మూసివేయాలని చూస్తున్నారు. సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ అని రేవంత్ రెడ్డి అన్నారు. 24 గంటల్లో కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి ఎందుకు ఇచ్చారు.
మోడీ,చంద్రబాబు ఇద్దరిలో ఎవరు చెప్తే రేవంత్ రెడ్డి సిబిఐకి ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి, చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయి. సీబీఐ విచారణ ద్వారా మోడీ,చంద్రబాబును రేవంత్ రెడ్డి సంతోషపెట్టారు. చివరకు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఒక్కటే మిగిలింది.
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ కూలడంపై రేవంత్ రెడ్డిపై సీబీఐ విచారణ చేయాలి. పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు పదిసార్లు కొట్టుకునిపోయింది. పోలవరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేస్తారా?
సీబీఐ అంటే కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ గా మారింది. కర్ణాటక కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే ..అక్కడ సిబిఐ కి ప్రవేశం లేదు. అక్కడ రాహుల్ గాంధీ మాట అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వింటోంది. ఇక్కడ కాంగ్రెస్ ముసుగులో బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. మోడీ చెప్పినట్టు రేవంత్ ఇక్కడ నడుచుకుంటున్నారు. అందుకే సీబీఐ విచారణ వేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితి నిన్న అసెంబ్లీలో ప్రజలు గమనించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంచి,చెడు నేను చూసుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు. అసెంబ్లీ వేదికగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని నమ్మితే నట్టేట మునిగినట్లే.
నిన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు చెట్టుకొకరు,పుట్టకొకరు అయ్యారు. రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి,చేసేది ఒకటి. అదానీ విషయంలో రాహుల్ గాంధీ వైఖరి ఒకలా రేవంత్ రెడ్డి వైఖరి మరోలా ఉంది. రేవంత్ రెడ్డి బీజేపీ చేతిలో కీలుబొమ్మ, తోలు బొమ్మగా మారారు. బీజేపీ ఆడుతున్న నాటకంలో రేవంత్ రెడ్డి పావుగా మారారు.
సీబీఐ,ఈడీ బీజేపీ జేబు సంస్థలు అంటున్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి ఎట్లా ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని సీఎం చేయడం కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.