పింఛన్‌ పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల సంబరాలు

* దివ్యాంగుల పింఛన్ మరో వెయ్యి రూపాయలు పెంచుతూ కేసీఆర్ గారి నిర్ణయం
* తాజాగా పెంచిన పెంపుతో పింఛన్ మొత్తం 4,116/- కు చేరిక
* రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల సంబరాలు
* రాష్ట్రంలో దివ్యాంగులకు మరింత ఆర్ధిక భరోసా
*తెలంగాణ భవన్ లో జరిగిన సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి

రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పింఛన్ మరో వెయ్యి రూపాయలు పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల సంబరాలు జేసుకుంటున్నారు. ఇప్పటికే దివ్యాంగులకు పింఛన్‌ అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానిది మొదటి స్థానంలో ఉంది.

తాజా పెంపుతో దివ్యాంగుల పింఛన్ మొత్తం 4,116 రూపాయాలకు చేరుకుంది. దీనితో దివ్యాంగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ లో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో వికలాంగులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దివ్యాంగుల పెన్షన్లు పెంచిన సందర్భంగా రాష్ట్రంలో దివ్యాంగుల సమాజం తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్కి కృతఙ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనకు ఇదొక నిదర్శనం అన్నారు. దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,40,000 మంది దివ్యంగులకు నెలకు 3,016/- ద్వారా నెలకు రూ .180 కోట్లు సం.రానికి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తుందని, ఒక్క పెన్షన్ నే కాకుండా వికలాంగుల సహకర సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా అందిస్తూ దివ్యాంగుల కోసం రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్నారు అని అన్నారు.

తాజాగా పెంచిన రూ. 1116/- పింఛన్ రాష్ట్రంలో దివ్యాంగులకు మరింత ఆర్ధిక భరోసా అందించిందని, దీనితో దివ్యంగులల్లో ఒక నూతన ఉత్సాహం వెళ్లి విరిసింది. వారిలో ఆత్మవిశ్వాసం, మనొనిబ్బరం పెరిగిందని, కేసీఆర్ కి దివ్యాంగుల సమాజం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందన్నారు.

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలభిషేకలు నిర్వహిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూన్నామన్నరు. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తం పెన్షన్లు ఇస్తున్నా రాష్ట్రం లేదు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం లో కూడా దివ్యంగులకు ఇచ్చేది కేవలం రూ. 1000/- మాత్రమే నన్నారు. ఏ రాష్ట్రంలో ఇంత మొత్తం ఇస్తలేరు.

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్లలో కేసీఆర్ దివ్యాంగుల పింఛన్‌ కోసం 10 వేల కోట్లకుపైగా వెచ్చించడం దివ్యంగుల సంక్షేమం విషయంలో కేసీఆర్ కి ఉన్న నిబద్ధతకు నిదర్శనం అన్నారు. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది దివ్యాంగులు తనకు ఫోన్ చేసి కృతఙ్ఞతలు తెలుపుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమానికి తాను ప్రతినిధిగా ఉండటం గొప్ప అదృష్టమని చెప్పారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమం విషయంలో ఒక స్వర్ణయుగం అని.. రాష్ట్రంలో తెలంగాణ ప్రగతి ఫలాలు ప్రతీ గడపకూ సంక్షేమ పథకాల రూపంలో అన్ని వర్గాలకు కేసీఆర్ చేరవేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఉన్న దివ్యంగులతో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు సహపంక్తి భోజనాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దివ్యంగుల సంఘాల నాయకులు మున్న, రాజ్యలక్ష్మి, అంధుల ప్రతినిధులు భాస్కర్, మహేందర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.