వ్యవసాయ చట్టాల రద్దును స్వాగతిస్తున్నాం:చంద్రబాబు

మూడు నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోంది. రైతుల ఆందోళనలకు స్పందించి బిల్లులు వెనక్కు తీసుకోవడం సముచితం. రైతుల సంక్షేమానికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయు, వాటి మీద దృష్టి పెడుతున్నాము ప్రధాని చెప్పడం అభినందనీయం. అదే సందర్భంలో ఏపీలో 34 వేల ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు 700 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నారు.
న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు 13 జిల్లాల నుండి పెద్ద స్థాయిలో సంఫీుభావం వస్తున్నది. రాజధాని కోసం 30 వేల ఎకరాలకు పైగా వుండాలని, అమరావతి రాజధానికి నాడు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేతతో సహా సభ్యులందరూ మద్దతు తెలిపి వున్నారు. చట్ట ప్రకారం రైతాంగానికి ప్రభుత్వం అగ్రిమెంట్‌ ఇచ్చి వున్నది. అమరావతిని ఏకైక రాజధానిగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించి వున్నారు.
అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల ద్వారా ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్ల ఆస్తి సమకూరి వున్నది. అమరావతి అభివృద్ధి అయితే 13 జిల్లాల అభివృద్ధికి నిధుల కొరత ఉండదు. అమరావతి అభివృద్ధితో 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి వస్తుంది. అమరావతి సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రం. కనుక మూడు సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకొన్న విధంగా మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకోవడం ద్వారా అమరావతి రైతాంగ ఆకాంక్షయే కాక రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గౌరవించాలి.

Leave a Reply