టీడీపీ ఆవిర్భావంతోనే బడుగు వర్గాలకు రాజకీయ గుర్తింపు

– రాష్ట్రంలో 29న వాడవాడలా టిడిపి ఆవిర్భావ వేడుకలు
-జగన్ నిర్ణయాలో పోలవరం నిర్వీర్యం అయ్యింది
– మద్యం విషయంలో జగన్ ప్రభుత్వాన్ని వదిలేదు లేదు:- నారా చంద్రబాబు నాయుడు
– టీడీపీ 40 వసంతాల ఆవిర్భావ వేడుకల లోగోను ఆవిష్కరించిన చంద్రబాబు

అమరావతి: టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహించబోతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29వ తేదీ వాడవాడల్లో పార్టీ కార్యక్రమాలు జరిపేందుకు పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తయారు చేసిన నలభై వసంతాల పార్టీ ఆవిర్భావ వేడుకల లోగోను టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో లోగో ఆవిష్కరణ జరిగింది. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించిందని చంద్రబాబు గుర్తు
tdp-logo1 చేశారు. రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు తెలుగు దేశం పాలనలో అందాయని తెలిపారు. ఇప్పుడు ఆ పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని చంద్రబాబు అన్నారు.

బిసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది టీడీపీనే అని….అనేక సామాజిక మార్పులకు టిడిపి ఆవిర్భావం కారణం అయ్యిందని చంద్రబాబు అన్నారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగు దేశమే అని…..జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తనదైన ముద్ర వేసిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆ రోజున గ్రామ గ్రామాన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. జెండాఆవిష్కరణలు చేపట్టాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు.

పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఆవిర్భావ వేడుకలు ఉండాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలని క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. హైదరాబాదులోని ఎమ్మెల్యేల క్వార్టర్స్ లో నాడు ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన ప్రాంతాన్ని సందర్శిస్తామని…అనంతరం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పిస్తామని చంద్రబాబు తెలిపారు. అనంతరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా వస్తారని చంద్రబాబు తెలిపారు.

అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలపై అభిప్రాయం కోరగా….అసలు అసెంబ్లీ సమావేశాలు జరిగాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. కల్తీ మద్యం వల్ల అంతమంది చనిపోతే కనీసం చర్చ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ కనుసన్నల్లోనే సరఫరా అవుతుందని… కొన్ని బ్రాండ్ల మద్యం ఎపిలో కన్పించకుండా పోవడడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. కిళ్లీ కొట్టులో కూడా ఆన్ లైన్ పేమెంట్లు ఉంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్లు ఎందుకు ఉండవని అన్నారు.

మద్యం విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్లేది లేదని… కల్తీ సారా వల్ల 42 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా అని మండిపడ్డారు. మద్యం విషయంలో సీఎం జగన్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో మా ఎమ్మెల్యేలు వివరించారు…దీనిపై ప్రజల్లోకి వెళ్తాం అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరానికి అన్యాయం జరుగుతోందని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ. 15,600 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని….ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ చేసిన తప్పుల వల్ల పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం అయ్యిందని అన్నారు. టీడీపీ హయాంలో పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులిస్తామని నాడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంగా చెప్పారని అన్నారు.

పోలవరం విషయంలో సీఎం జగన్ నంగి నంగి మాట్లాడుతున్నారని…వాస్తవాలు చెప్పాలని అన్నారు. మిగిలిపోయిన కాఫర్ డ్యాం పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే.. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేదే కాదని అన్నారు. తప్పులు అన్నీ జగన్ చేసి…ఇప్పుడు టిడిపిపై తోస్తున్నారని అన్నారు.

ఈ ప్రభుత్వం చేసిన దరిద్రపు పనికే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని మండిపడ్డారు. పోలవరం- అమరావతి ఏపీకి రెండు కళ్లు అయితే….ఆ రెండు కళ్లను సీఎం జగన్ పొడిచేశారని చంద్రబాబు అన్నారు.

Leave a Reply