Suryaa.co.in

Telangana

పరిపాలన చేతకాక సీఎం ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు

* కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక, వివిధ వర్గాల సమస్యలను పరిష్కరించలేక తన సహజ దోరణిలో ప్రజలను బ్లాక్ మెయిల్ కు దిగడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ మండిపడ్డారు.

కెసిఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేళ్లలో అన్నిరంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న రాష్ట్రాన్ని ప్రతీకారేచ్ఛతో రేవంత్ రెడ్డి అధోగతి పట్టించారని, అప్రతిష్టపాలు చేశాడని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం చేతకాక వాళ్లను బ్లాక్ మెయిల్ దోరణి తో బెదిరిస్తున్నారని అన్నారు.

అదికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి రాష్ట్రం అప్పుల పాలయిందని, దివాళా తీసిందంటూ స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రోడ్డున పడేశారు. ప్రజలకిచ్చిన 420 హామీలను అమలు చేయకపోగా.. హైడ్రా, మూసీ ప్రక్షాళన, లగచర్ల భూసేకరణ పేరిట పేద, మధ్య తరగతి ప్రజల మీదకు బుల్డోజర్లను దించి అరాచక పాలన సాగిస్తున్నది.

తాజాగా ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై గడచిన 17 నెలలుగా పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. గత్యంతరం లేక వారు ఆందోళన బాట పడితే చర్చించి వారి ఆందోళన కు పరిష్కారం చేయకుండా స్వయంగా ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ కు దిగడం దారుణం.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతివిషయంలో నోరుపారేసుకునే దోరణి మానుకుని సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

LEAVE A RESPONSE