ఖమ్మం జిల్లాకు సీఎం కేసిఆర్ వరాల జల్లు

-ఖమ్మం కార్పోరేషన్ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు
-గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు
-మేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు
-ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల
-మున్నేరు నది పైన నూతన వంతెన నిర్మాణం

బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఖమ్మంలోని గ్రామ పంచాయతీలకు వరాలు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పెద్దతండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండి.. మేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి అజయ్ కోరిక మేరకు ఖమ్మం కార్పోరేషన్ అభివృద్ధికి మరొక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మున్సిపాలిటీలకు మధిర, వైరా, సత్తుపల్లి కి తలా రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి పువ్వాడ విన్నపం మేరకు ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. ఖమ్మం కాల్వొడ్డు మున్నేరు నది పైన నూతన వంతెన నిర్మాణం కొరకు సీఎం కేసిఆర్ హామీ.

Leave a Reply