సూక్ష్మ పరిశీలన.. లోతైన విశ్లేషణ సీఎం కేసీఆర్ సొంతం

-కేసిఆర్ తో 22 ఏళ్ల అనుబంధంలో నేను గమనించిన అంశాలివీ
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి.లో ప్రముఖ ఆర్థికవేత్త, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్ ఆధ్వర్యంలోని సిజిస్ సంస్థ నివేదిక, కాకతీయ గవర్నెన్స్ ఫెలోస్ (కే.జీ.ఎఫ్), ప్రణాళికా శాఖల ప్రగతి నివేదికపై సమావేశం,పలు ప్రచురణల ఆవిష్కరణ.

సూక్ష్మ పరిశీలన లోతైన విశ్లేషణ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంతమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అమెరికా కొలంబియా యూనివర్సిటీ ప్రముఖ ఆర్థికవేత్త, సీజిస్ సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ( టీ.ఎస్.డి.పి.ఎస్ ), డైరెక్టర్ రేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంస్థలు సంయుక్తంగా ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిజిస్ సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ గవర్నెన్స్ ఫెలోస్ ( కే.జీ.ఎఫ్ ) ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ, పంచాయతీ రాజ్, ఆర్థిక, స్త్రీ శిశు సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు సహా పాలు ఇతర శాఖలు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ప్రగతి నివేదికపై రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావుతో కలిసి విశ్లేషించి, ఆయా రంగాల ప్రగతి పురోగతి సర్వే నివేదికలను పరిశీలించారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యక్రమాలను కూడా వినోద్ కుమార్ విశ్లేషించి, అందుకు అనుగుణంగా ఆయా శాఖలకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి అంశాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలించడం, లోతుగా విశ్లేషించడం అన్నది సీఎం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని, ఇవి కేసీఆర్ తో ఉన్న 22 సంవత్సరాల అనుబంధంలో తాను గమనించిన అంశాలని పేర్కొన్నారు. ప్రతి అంశం పై కెసిఆర్ కు పక్కా విజన్ ఉంటుందని, ఆ విజన్ తోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని, ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ సంస్థ పలుమార్లు కితాబు ఇచ్చిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఇక వైద్యం, ఆరోగ్యం, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యమని, విద్యా రంగంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో ఉద్యమించిన టిఆర్ఎస్ పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నినాదాన్ని వాస్తవ రూపంలో అమలు చేసి చూపిందని వినోద్ కుమార్ వివరించారు.

ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అర్థ గణాంక శాఖ ఆధ్వర్యలో ముద్రించిన ” తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2022 ” డేటా బుక్ , పిడుగు ప్రమాదం నుంచి సురక్షితంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీఎస్ డిపిఎస్ సంస్థ ముద్రించిన వాల్ పోస్టర్ ను, ” వెదర్ అండ్ క్లైమాతోలాజి ఆఫ్ తెలంగాణ ” పబ్లికేషన్ ను వినోద్ కుమార్, రామకృష్ణారావు, సహా ఇతర అధికారులు ఆవిష్కరించారు.

సిజిస్ సంస్థ ఫౌండర్, అమెరికా కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ప్రముఖ ఆర్థికవేత్త కార్తిక్ మురళీధరన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడగా, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, కార్యదర్శి రోనాల్డ్ రోస్, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, టీ.ఎస్.డీ.పీ.ఎస్. సంస్థ ఈ.వో. రామకృష్ణ, శివ కుమార్, ప్రసాద్, ప్రముఖ వాతావరణవేత్త డాక్టర్ వై.వీ. రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply