Suryaa.co.in

Telangana

గడ్కరీజీ..మాపై కరుణ చూపండి

– కేంద్రమంత్రి గడ్కరీని కలసిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులతోపాటు, పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రధానంగా హైదరాబాద్-వరంగల్ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. దానికి కేంద్రమంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చిం చారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని కోరారు.

రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఎన్ హెచ్ 765 లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.

హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే ను వీలైనంత త్వరగామంజూరు చేయాలని అభ్యర్థించారు. ORR, RRR లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు.

హైదరాబాద్-డిండి- మన్ననూర్, హైదరాబాద్- మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే, ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్ అభివృద్ధి పనులకు సంబంధించి వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించారు.

సీఎంతోపాటు గడ్కరీతో భేటీలో పా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, సలహాదారులు హర్కర వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE