Suryaa.co.in

Andhra Pradesh

కొనసాగుతున్న మార్పులకు ఓటు వేయాలి

-తుగ్గలిలో ప్రజలు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ముఖాముఖి
-నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని నమ్మితే ఓటేసి మీ బిడ్డకు అండగా ఉండాలి
-మీరు సూచనలు, సలహాలు ఇస్తే ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను
-దేశంలో రూ. 3వేల పెన్షన్ ఇస్తున్నది మనమే
-మేమంతా సిద్ధం నాలుగోరోజు బస్సు యాత్ర
-కర్నూలు జిల్లా, తుగ్గలిలో తుగ్గలి,రాతన ప్రజలతో ముఖాముఖిలో సీఎం వైఎస్‌.జగన్‌

నాలుగో రోజు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గులి, రాతన గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించారు. అలాగే లబ్ధిదారులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను, సూచనలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..:
ఇదే తుగ్గలి గ్రామానికి సంబంధించి గమనిస్తే 1748 ఇల్లులు ఉండగా, మన పాలనలో నేరుగా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి డబ్బలు వచ్చాయి. ఎక్కడ లంచాలు అడిగే వారు లేరు. వివక్షకు చోటు లేదు. కులం, మతం, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అనేది కూడా చూడకుండా, ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా పర్లేదు వారికి కూడా లబ్ది చేకూరాలని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం.

1,748 ఇల్లులుంటే 1,666 గృహాలకు అంటే 95 శాతం ఇళ్లకు లబ్ది చేకూర్చాం. ఇలా లబ్ది చేకూర్చగలమని, ఇలా చేసే పరిస్థితి ఉందని గతంలో ఎవరైనా చెప్పగలిగారా?గత ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, సబ్సిడీలోన్లు కావాలన్నా లంచాలు ఇస్తే కానీ పని జరిగేది కాదు.

రాతన గ్రామానికి సంబంధించి సచివాలయంలో 4888 మంది జనాభా, 1,569 ఇళ్లులుండగా 95 శాతం ఇల్లులకు లబ్ది చేకూర్చాం. రూ. 26కోట్ల 59 లక్షలను రాతన సచివాలయ పరధిలో అక్క చెల్లమ్మలకు లబ్ది చేకూర్చాం.

వ్యవస్థలో ఎటువంటి మార్పులు వచ్చాయో ప్రజలు ఆలోచించాలి. 58 నెలల్లో ప్రతి గ్రామంలో ఓ సచివాలయం నిర్మించి, వాలంటీర్లను ఏర్పాటు చేసాం. రైతన్నను చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థ ఆర్బీకే. మొట్టమొదటి సారిగా వ్యవసాయం మారింది. రైతన్నలు గతంలో ఇన్సూరెన్స్ కావాలంటే క్రాప్ లోన్ తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ప్రతీ ఎకరాకు ఇ – క్రాప్ చేసి ఉచితంగా పంట భీమా కల్పించి ప్రతి దశలోనూ రైతన్నకు తోడుగా ఉంటున్నాం.

మొట్టమొదటి సారిగా ప్రభుత్వ బడుల రూపు రేఖలను మార్చాం. నాడు – నేడు తెచ్చాం. తెలుగు మీడియం పోయి ఇంగ్లీషు మీడియం తీసుకువచ్చాం. ఎనిమిదో తరగతి విద్యార్థి కి ట్యాబ్ లు ఇచ్చాం. ఆరో తరగతి ఆపై తరగతులకు చెందిన క్లాస్ రూమ్ లో డిజిటల్ బోధన పేద విద్యార్థులకు చేస్తున్నాం. కార్పొరేట్లు కూడా ప్రభుత్వ స్కూల్స్ తో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. మార్పును గమనించాలని కోరుతున్నాను. గ్రామాల్లో విలేజ్ క్లీనిక్ లు ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ను తీసుకువచ్చిఅనుసంధానం చేసాం.

ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేదాని కోసం కాదు. జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం కోసం ఓటు వేయాలి, మార్పులు కొనసాగితేేనే పేదల తలరాతులు మారుతాయి. పేద వాడి బ్రతుకులు కూడా మారుతాయని ప్రజలు ఆలోచన చేయాలి. నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉందని నమ్మితే.. ఓటు వేసినప్పుడు మీ బిడ్డకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరిచ్చే సూచనలు, సలహాలు ఇస్తే మరింత మెరుగ్గా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ స్పష్టం చేశారు.

దేశంలో రూ. 3వేల పెన్షన్ ఇస్తున్నది మనమే..
మన ప్రభుత్వం రాక ముందు చంద్రబాబు పాలనలో నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో పెన్షన్ ఎంత అని ప్రతి అవ్వని, తాతను అడగాలి. ఆయన హయాంలో పెన్షన్ ఎంత.. మీ బిడ్డ హయాంలో ఇవాళ పెన్షన్ ఎంత అని అడగాలి. దేశంలోనే రూ. 3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు. పెన్షన్ల కోసం ఏటా రూ. 24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లోను పోల్చుకుంటే రెండో స్థానంలో తెలంగాణ కేవలం రూ. 12 వేల కోట్లు ఉంది.

ఎక్కడ చూసినా పెన్షన్ రూ. 500 మాత్రమే ఉంది. మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రం అవ్వ, తాతా, వితంతుల మీద ప్రేమ, అభిమానంతో 66 లక్షల మందికి ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో రూ. 39 లక్షలు మందికి మాత్రమే ఇచ్చేవారు. 66 లక్షల్లో 45 లక్షలు మంది అక్క చెల్లెమ్మలు, అవ్వలే ఉన్నారు అని సీఎం తన ప్రసంగం ముగించారు.

LEAVE A RESPONSE