Suryaa.co.in

Telangana

దేశాన్ని మతం పేరుతో విడగొట్టిన నీచపు చరిత్ర కాంగ్రెస్ పార్టీది

– ఆర్ఎస్ఎస్ లాంటి సేవా సంస్థలపై నిషేధం విధించినప్పుడు చట్టపరంగా ఎదుర్కొన్నాం
– సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు నకిలీ గాంధీలు
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్: ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడగొట్టిన నీచపు చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎమర్జెన్సీని విధించి ప్రజల గుండెల్లో చీకట్లు నింపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని మతం పేరుతో విడగొట్టిన నీచపు చరిత్ర కాంగ్రెస్ పార్టీది.

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏ విధంగా ఏర్పాటు అయ్యాయి..? ఆ వేర్పాటువాదానికి కారణం ఎవరో కూడా చెప్పాలి. ఈ దేశ ప్రతి పౌరుడు చట్టాలకు లోబడి నడుచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసి బిజెపి కార్యకర్తల పై, ఆర్ఎస్ఎస్ లాంటి సేవా సంస్థలపై నిషేధం విధించినప్పుడు చట్టపరంగా ఎదుర్కొన్నాం తప్ప, ఇలా రోడ్లమీదకి రాలేదు.

ఈ దేశ చట్టాలపై ప్రజాస్వామ్యం పై గౌరవంతో కేసులను ఎదుర్కొని నిర్దోషులుగా బయటకు వచ్చిన చరిత్ర బిజెపిది. పాతాళం నుండి ఆకాశం వరకు అవినీతిమయం చేసి దేశాన్ని అంధకారంగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.

బిజెపి కార్యకర్తలు గాని నేతలు కానీ ఏ రోజు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని అనుచితంగా వ్యాఖ్యలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల గురించి ఎలా మాట్లాడాలో తెలియకపోవడం సిగ్గుచేటు…
బిజెపి నాయకులపై అద్దంకి దయాకర్, అంజన్ కుమార్ యాదవ్ మాటలు.. వారి భాష కాంగ్రెస్ పార్టీ నైజాన్ని మరోసారి బయటపెట్టింది. ఇలాంటి కారుకూతలు కూసే అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డంకిగా మారాడని ఇన్ని రోజులు పక్కకు పెట్టారు. పదవి రాగానే మళ్లీ అవే కారుకూతలు కూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరిస్తున్నాం. దేశ ప్రధాని మోదీ గారిపై దిగజారుడు మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు.

తప్పు చేయకపోతే కోర్టులను ఆశ్రయించి నిర్దోషులుగా బయటకి వచ్చే అవకాశం ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా తప్పు చేశారు కాబట్టి ఇక జైలుకు వెళ్ళిపోవాలని అభద్రతతో ఇలా రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు.

కొత్తగా ఎన్నికైన అద్దంకి దయాకర్ క్రమశిక్షణ, బాధ్యతలు తెలుసుకోకుండా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజలు దూరం పెడితే మేనేజ్మెంట్ కోటా లో mlc అయిన వ్యక్తి అద్దంకి దయాకర్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు నకిలీ గాంధీలు. కాంగ్రెస్ పార్టీని మూసీనదిలో ముంచి బొంపపెట్టే సమయం ఆసన్నమైంది.

శాంతియుతంగా నిరసన తెలిపిన బిజెవైఎం కార్యకర్తలను లాక్కెళ్లి, పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది. పోలీసులు కేవలం కాంగ్రెస్ పార్టీకి సెక్యూరిటీ ఇవ్వడమే కాకుండా, రాజ్యాంగాన్ని గౌరవించని వారు ధర్నాలు చేయడానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉన్నారు.

అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని శాసనమండలి చైర్మన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాని మోదీ పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకుల పై పోలీసులు వెంటనే కేసులు వేసి విచారణ జరపాలి. వారి ప్రవర్తన రాజ్యాంగ, ప్రజాస్వామ్య గౌరవాన్ని అవమానపరుస్తోంది.

LEAVE A RESPONSE