Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..

– అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు
– ట్విట్టర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ పాలనలో మళ్లీ దుర్భిక్షం తాండివస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు మళ్లీ చెడ్డరోజులొచ్చాయన్న కేటీఆర్.. రైతులు-కరెంట్ కోతలపై ట్వీట్ చేశారు. ఆ మేరకు నిన్న రైతులు తమ పాసు బుక్కులను క్యూలో ఉంచిన ఫొటోను జతపరిచారు.

6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!

6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!

పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం

విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం

కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నం

ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం

సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నం

ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నం

చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నం

పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నం

రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నం

తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాం
పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నం

చివరికి ఇవాళ జోగిపేటలో..
విత్తనాల కోసం రైతుల మొక్కులు…
క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం…!

కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..!
అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు..!!

ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో..
ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..!!

జై కిసాన్
జై తెలంగాణ

LEAVE A RESPONSE