Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి, కుంభకోణాలే

-మహిళలకు మోదీ షూరిటీ పెట్టి బ్యాంకు అకౌంట్లు
-ఆయుష్మాన్ భారత్ పథకంతో పేదలకు వైద్యం
-గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్లు లేవు
-మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు
-మక్తల్ రోడ్ షో లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మక్తల్ : 2013లో తెలంగాణ సాధనకోసం ఇక్కడనుండే ప్రారంభించిన పోరు యాత్ర తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో కూడా మార్పు రావడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నాం.

నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని ఆకాంక్షిస్తున్నా. నరేంద్ర మోదీ మూడవ సారి ప్రధాని కావాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు. దేశంలోని అనేక రకాల సమస్యలను పరిష్కరించారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాడికి న్యాయం జరగలేదు.

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు 4కోట్ల ఇళ్లు కట్టించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. పొగ బారిన పడకుండా దేశంలోని పేద మహిళలకు కోట్లాది గ్యాస్ కనెక్షన్లు అందించారు. కేంద్రం ప్రతీ పేదవాడికి బ్యాంకు అకౌంట్లు అందించింది. పేదలకు, మహిళలకు మోదీ షూరిటీ పెట్టి బ్యాంకు అకౌంట్లు తెరిపించారు.

ప్రతీ పేదవాడికి ఉచితంగా 5 కేజీల బియ్యం… రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందిస్తున్నారు. యూరియా బస్తా మీద రూ.1,300 కేంద్రం సబ్సీడి ఇస్తుంది. పొదుపు సంఘాల మహిళలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో పేదలకు వైద్యం అందిస్తున్నారు.. జాతీయ రహదారులు వేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్లు లేవు.

తొమ్మిదేళ్లు కేసీఆర్ కుటుంబం రాష్ట్నాన్ని దోచుకుంటే..ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు పెట్డడానికి వాడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ట్యాక్సీ కడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి, కుంభకోణాలే. కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ పాలన.

గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు అవినీతి రహిత పాలన అందిస్తున్నారు.దేశ ప్రజల కోసం, దేశం కోసం నరేంద్ర మోదీ గారు పాలన చేస్తున్నారు. యూపీఏ పాలనలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు, మత కల్లోహాలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఉగ్రావాదాన్ని ఉక్కుపాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం అణచి వేసింది.

వచ్చే పార్లమెంటు ఎన్నికలు తెలంగాణకు సంబంధించినవి కావు. దేశానికి సంబంధించిన ఎన్నికలు. మన పిల్లలకోసం, దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం మోదీ ని ఎన్నుకోవాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి.

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అలవి కానీ హామీలు ఇచ్చారు. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంతవరకు అతీ గతీ లేదు. నేను రాగానే రైతులకు రుణమాఫీ, ఎకరానికి రూ.15,000 మహిళలకు రూ.2500 అని చెప్పారు. మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు..వాళ్లు మాత్రం కుర్చీలో కూర్చున్నారు.

LEAVE A RESPONSE