Suryaa.co.in

Telangana

కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

-ఫిరాయింపులకు కాదు పంటలను కాపాడేందుకు గేట్లు తెరవాలి
-మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే మాకు అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం ఉండదు
-దేవుడి పేరుతో రాజకీయం తప్ప బీజేపీ ఏం చేసింది?
-ఢల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే
-భువనగిరిలో మల్లేష్‌ను గెలిపించుకోవాలి
-మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపు

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరి బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. 2014లో పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించుకున్న స్ఫూర్తితో 2024లోనూ గెలిపించాలని పిలుపునిచ్చారు. 40 రోజులు కష్టపడితే భువనగి రిలో గెలుస్తామని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది…ఆ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్‌, కడియం కావ్య, రంజిత్‌ రెడ్డి, పట్నం సునీతలు పార్టీ మారడాన్ని ప్రజలు హర్షించడం లేదు. స్వార్థపరులే పార్టీలు మారుతున్నారు. వారిని ఓడిరచాలని కార్యకర్తలు కసితో ఉన్నారు.

భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేష్‌ బలహీన వర్గాల నేత. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ఆయనను పార్లమెంటుకు పంపితే న్యాయం జరుగు తుందని అన్నారు. ఇక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థి రాహుల్‌ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరణకు గురైన వ్యక్తి అని అతనితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ నేతలు వందరోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నారు.. ఎన్నికల కోడ్‌ అడ్డం పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనకు వందరోజులు నిండాకే కోడ్‌ అమల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీల్లో తొలి హామీ మహిళలకు రూ.2500 ఇస్తామని అమలు చేయలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్‌, రూ.4 వేల పింఛన్‌, 15 వేల రైతుబంధు, తులం బంగారం, రూ.4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల బ్యాంకు కార్డు వీటిలో ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. మాట తప్పిన కాంగ్రెస్‌ను ఓడిరచి బుద్ధి చెప్పా లని పిలుపునిచ్చారు.

నిరుద్యోగులకు 4 వేలు ఇస్తామని రేవంత్‌ చెప్పిండు. ప్రియాంకా గాంధీ ఈ భువనగిరిలోనే హామీ ఇచ్చింది. కానీ అలాంటి హామీనే ఇవ్వలేదని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి చెప్పిండు. కేసీఆర్‌ మాటంటే మాటే. అధికారంలోకి రాగానే రూ.200 పెన్షన్‌ను వెయ్యి చేసిండు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి పింఛన్‌ రూ.2 వేలు చేసిండు. కాంగ్రెస్‌ హామీలు అమలు కావాలంటే ఎన్నికల్లో ఆ పార్టీ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ప్రజలను మోసం చేసినా తమకే ఓటేశారని ప్రచారం చేసుకుంటారని, మేం అసెంబ్లీలో ప్రశ్నించడానికి వీలుండదని చెప్పారు.

రేవంత్‌ పేగులు మెడలో వేసుకంటానని అంటున్నాడు. ఆయనేమన్నా రాక్షసుడా? మానవీయ పాలన అందించాలి తప్ప ఇవేం మాటలు అని హితవు పలికారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలుచేయని కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఫిరాయింపులకు కాదు, పంటలను కాపాడటానికి గేట్లు తెరవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ కూడా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. గ్యాస్‌, పెట్రోల్‌ ధరలను భారీగా పెంచింది…నల్లధనం తేలేదు… 2 కోట్ల ఉద్యోగాలివ్వలేదు… దేవుడి పేరుతో రాజకీయాలు తప్ప ప్రజలకు చేసిన మేలేంటో బీజేపీ చెప్పాలని ప్రశ్నిం చారు. ఢల్లీిలో తెలంగాణ గళం వినిపించాలంటే మన క్యామ మల్లేష్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉన్నంతకాలం…భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటుందని ధైరం నింపారు.

LEAVE A RESPONSE