మంత్రి కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పోరేషన్ డైరెక్టర్లు

– నగుళ్ళ, కనకదుర్గలకు ఘన సత్కారం
గుడివాడ, సెప్టెంబర్ 6: రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన నగుళ్ళ సత్యనారాయణ, ఏపీ స్టేట్ బ్రాహ్మిణ్ కార్పోరేషన్ డైరెక్టర్ గా నియమితులైన తుర్లపాటి కనకదుర్గలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో నగుళ్ళ సత్యనారాయణ, తుర్లపాటి కనకదుర్గలకు మంత్రి కొడాలి నాని పుష్పగుచ్ఛాలను అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్పోరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన నగుళ్ళ, కనకదుర్గలు మాట్లాడుతూ తమపై ఎంతో విశ్వాసంతో అప్పగించిన పదవులకు న్యాయం చేస్తామన్నారు. ఆయా కార్పోరేషన్ల ద్వారా ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు. కార్పోరేషన్ డైరెక్టర్లుగా నియమించిన సీఎం జగన్మోహనరెడ్డి, మంత్రి కొడాలి నాని, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గతంలో మాదిరిగా నామినేటెడ్ పదవులు అలంకార ప్రాయం కాదని చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తోందన్నారు. నామినేటెడ్ పదవులను పొందిన వారికి కూడా అంతే బాధ్యత ఉంటుందన్నారు .
ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పనిచేయాలని సూచించారు. గత రెండేళ్ళుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారత దిశగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. బీసీ డిక్లరేషన్ చేసినప్పటి నుండి వెనకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడడం జరుగుతోందన్నారు. గత రెండేళ్ళుగా సీఎం జగన్మోహనరెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ వచ్చారన్నారు. దీనికి నామినేటెడ్ పదవుల ఎంపికే నిదర్శనమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహనరెడ్డి అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలతో మమేకమయ్యారని చెప్పారు. అనేక మంది నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారన్నారు. వీరిలో కొద్ది మందికి కార్పోరేషన్ పదవులతో బాధ్యతలను అప్పగించడం జరుగుతోందన్నారు. రానున్న కాలంలో మిగిలిన వారికి కూడా పార్టీపరంగా బాధ్యతలు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తారన్నారు. ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గా నగుళ్ళ సత్యనారాయణ, ఏపీ స్టేట్ బ్రాహ్మిణ్ కార్పోరేషన్ డైరెక్టర్ గా తుర్లపాటి కనకదుర్గలను నియమించడం పట్ల మంత్రి కొడాలి నాని హర్షం వ్యక్తం చేస్తూ, వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు తుర్లపాటి రవి, మొండ్రు వెంకటేశ్వరరావు, పిళ్ళా శేఖర్, గొరుముచ్చు సురేష్, చిట్టి, కాళ్ళకూరి హరిప్రసాద్, అగస్త్యరాజు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply