Suryaa.co.in

Andhra Pradesh

కేసీఆర్‌ బిడ్డింగ్‌ వేస్తుంటే.. జగన్‌ చంక నాకుతున్నారా?

-తెలంగాణ బిడ్‌ వేస్తే ఏపీ సర్కారు గాడిదలు కాస్తోందా?
– విశాఖ స్టీల్‌ బిడ్డింగ్‌పై సీపీఐ రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు

‘విశాఖ స్టీల్‌ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌ వేస్తే ఏపీ సీఎం జగన్‌ చంకనాకుతున్నారా? ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం బిడ్‌ వేస్తే, సీఎం జగన్‌కు ఆత్మహత్యే శరణ్యం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌ వేస్తుంటే, ఏపీ ప్రభుత్వం గాడిదలు కాస్తోందా? అని ప్రశ్నించారు. ‘చిన్న రాష్ట్రం బిడ్డింగ్‌లో చిన్న రాష్ట్రం తెలంగాణ పాల్గొంటే జగన్‌ ఉంది చంకనాకడానికా? బిడ్డింగ్‌లో ఆ రాష్ట్రం పాల్గొంటే అది ఏపీకి, ముఖ్యంగా సీఎం జగన్‌కు ఆత్మహత్యతో సమానం. అది ఏపీకి అవమానం. జగన్‌కు దమ్ముంటే, ప్రధాని వద్దకు వెళ్లి విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ఆపాలి. లేకపోతే చేతకాకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలి. ఎందరి బలిదానాలతో వచ్చిన విశాఖ ఉక్కును, ప్రైవేటీకరిస్తున్నందుకు బీజేపీ ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? ప్రైవేటీకరణను ఆపే శక్తి జగన్‌కు లేకపోతే మోదీపై యుద్ధం ప్రకటించాలి. అని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE