Home » పీతల మూర్తి యాదవ్ కు త్వరలో సిఎస్ లీగల్ నోటీస్

పీతల మూర్తి యాదవ్ కు త్వరలో సిఎస్ లీగల్ నోటీస్

అమరావతి,26 మే: విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిపై రెండు రోజులుగా అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు జారీ చేయనున్నారు.

శనివారం విశాఖపట్నంలో కార్పోరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డి వారిపై చేసిన అసత్యమైన,నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా స్టేట్మెంట్/రిజాయిండర్ ఇవ్వడమైనది.

అయినప్పటికీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మరొకసారి ఆదివారం విశాఖపట్నంలో మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వారిపై మరొక సారి అవే అసత్య,నిరాధారమైన ఆరోపణలను చేయడం తీవ్రంగా పరిగణించడమైనది.

మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులను సంప్రదించడం జరిగింది. త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు జారీ చేయడం జరుగుతుంది.

Leave a Reply