భక్తులు ఓపికగా ఉండేలా రావాలి

-విపరీతమైన రద్దీ కారణంగా భక్తులు తిరుమలకు రావద్దు అంటూ అధికారుల సూచనలపై స్పందించిన తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావద్దని టీటీడీ ఎప్పుడూ చెప్పలేదని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉందని, వారికి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆదివారం తనను కలసిన మీడియాతో చైర్మన్ మాట్లాడుతూ… వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని, అధిక సంఖ్యలో భక్తులు తిరుమల కు తరలి వస్తున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ పాటు చాలామంది భక్తులు తిరుమల కు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, ఉద్యోగులు బ్రహ్మాండంగా పని చేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని చైర్మన్ అభినందించారు.

 

Leave a Reply