ఓటర్ వెరిఫికేషన్ చేసి, ఓటు కు ఆధార్ అనుసంధానం చేయండి

– సభ్యత్వ నమోదు వేగవంతం చేయండి
– మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెంకటాచలం,మనుబోలు,పొదలకూరు,మండలాల ముఖ్య నాయకులతో ,అనుబంధ సంఘాల నాయకులతో మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చిన ఫేస్ 1 ఓటర్ వెరిఫికేషన్ ప్రారంభించాలని, ఓటు కు అనుసంధానం గురించి, మూడు మండలాలలో మిగిలి ఉన్న పంచాయతీలలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఓటర్ వెరిఫికేషన్ చేసి, ఓటు కు ఆధార్ అనుసంధానం యొక్క ఆవశ్యకతను ఓటర్ లకు తెలియపరచాలని, ప్రతి ఓటర్ ఆధార్ అనుసంధానం చేయించుకునేలా చూడాలని అన్నారు.

కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మిసురేంద్ర, పార్లమెంట్ అధికార ప్రతినిధి ఉచ్చీ భువనేశ్వరి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు రాజాయాదవ్ ముఖ్య నాయకులు,అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply