దేవినేని అవినాశ్ ను శిక్షించే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?

• ఆడబిడ్డల శరీరాలతో వ్యాపారంచేసే దేవినేని అవినాశ్ ను శిక్షించే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?
• కొడాలనాని, వల్లభనేని వంశీని మించిపోవాలన్న అత్యాశతో వ్యభిచారకేంద్రాలు నిర్వహించే దుస్థితికి దేవినేని అవినాశ్ వచ్చాడు.
• తనను ఎవరూఏమీచేయలేరని అవినాశ్ మిడిసిపడటానికి కారణం ముమ్మాటికీ జగన్ రెడ్డి అసమర్థత, అండదండలే.
• గంటా..అరగంటా అవంతిని, సంజనాసుకన్యా అన్నరాంబాబుని జగన్ రెడ్డి కట్టడిచేసుంటే, అవినాశ్ సెక్స్ రాకెట్లు నడిపేవాడా?
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు

రాష్ట్రాన్ని కుంభకోణాలు, దోపిడీలకు నెలవుగా మార్చిన వైసీపీనేతలు, డబ్బుకోసం ఆఖరికి ఆడబిడ్డల శరీరాలను అంగట్లోసరుకుగా మార్చే దుస్థితికి దిగజారారని, రాజకీయాలకు కేంద్ర బిందువైన విజయవాడనగరాన్ని వ్యభిచారకేంద్రాలు, డ్రగ్స్ సెంటర్ల అడ్డాగా మార్చారని టీడీ పీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు, ఆయనమాటల్లోనే …!

“రాష్ట్రపరిస్థితి, ప్రజలదుస్థితి చూస్తుంటే చెప్పలేనంతబాధగా ఉంది. అత్యాచారాలు, హత్యలు, భూకబ్జాలు, కుంభకోణాలు, లిక్కర్, ఇసుకమాఫియాల్లో మునిగితేలుతున్న వైసీపీనేతలు, తాజాగా సెక్స్ రాకెట్లలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. రాజకీయాలకు కేంద్రబిందువుగా చెలామణీ అయిన విజయవాడనగరాన్ని, జగన్ రెడ్డి డ్రగ్స్ కు నిలయంగా, వ్యభిచారగృహాలకు ఆలవాలంగామార్చాడు. గుట్కాలుతింటూ కేసినోలు నడిపేవారు, సంస్థలముసుగులో ప్రజలసొమ్ము కొట్టేసేవారు, వ్యభిచారకేంద్రాలు నడిపేవారు నేడు బెజవాడలో నాయకులుగా తిరుగుతున్నారు. వైసీపీలో తనను మించిన నాయకుడులేడని మిడిసిపడే దేవినేని అవినాశ్, బూతులనాని, తల్లిపాలుతాగిరొమ్ము గుద్దే వల్లభనేని వంశీలకు పోటీగా ఎదగాలన్న తాపత్రయంలో సిగ్గు,శరం లేకుండా వ్యభిచారకేంద్రాలు నిర్వహించేస్థాయికి దిగజారాడు.

అవినాశ్ అనే విషపుమొక్కను ఆదిలోనే జగన్ రెడ్డి తుంచేసి ఉంటే, నేడు విజయవాడ నగరం వ్యభిచారకేంద్రాలకు నెలవుగా మారేదికాదు. విజయవాడలో వైసీపీమహిళానేత గురుసాయి నడుపుతున్న వ్యభిచారకేంద్రాల వెనక అవినాశ్ ఉన్నాడని రాష్ట్రమంతా కోడైకూస్తోంది. నాగసాయిని కాపాడటానికి అవినాశ్ ఎన్నిసార్లు విజయవాడ పటమట పోలీసులకు ఫోన్ చేశాడో చెప్పాల్సిన పనిలేదు. నాగసాయి, అవినాశ్ ల దుష్టక్రీడలో ప్రకాశ్ అనే యువకుడు అన్యాయంగా బలైపోయాడు. ఆడబిడ్డల శరీరాలతో వ్యాపారం చేసే నికృష్ఠుల విషయంలో ముఖ్యమంత్రి, పోలీసులు ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించకపోతే, మరిన్ని దారుణాలు చూడాల్సిన దుస్థితి ప్రజలకు వస్తుంది. డీజీపీ అవినాశ్ చొక్కా పట్టుకొని లాక్కొచ్చి సెల్లో వేస్తే, పోలీస్ శాఖ తమకోసం పనిచేస్తుందనే నమ్మకం ప్రజలకు కలుగుతుంది.

టీడీపీ కార్యాలయంపై దాడిచేసినప్పుడే జగన్ రెడ్డి అవినాశ్ ను కట్టడిచేస్తే ఆడబిడ్డల జీవితాలు నాశనమయ్యేవా?
దేవినేని అవినాశ్ గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినదాడి ఘటనలో ప్రధాననిందితుడుగా ఉన్నాడు. టీడీపీ జాతీయఅధికారప్రతినిధి పట్టాభిరామ్ ఇంటిపైకి రౌడీమూకల్ని పంపి, వారింట్లోని చంటిపాపను బెదిరించింది అవినాశ్, అతని అనుచరులుకాదా? ఇన్నిచేసినా అవినాశ్ ను ఈ ప్రభుత్వం ఏమీచేయలేదు. అండదండలు పుష్కలంగా ఉండబట్టే, తనను ఎవరూఏమీ చేయలేరంటూ అవినాశ్ విర్రవీగుతున్నాడు. ఒకమహిళను ఉద్దేశించి ఒకగంటవచ్చి, తనకు మసాజ్ చేసివెళ్లు అని అవంతి శ్రీనివాస్ అన్నప్పుడే ముఖ్యమంత్రి అతనిపై చర్యలుతీసుకొని ఉంటే, నేడు అవినాశ్ వ్యభిచారకేంద్రాలు నడిపేవాడా? అంబటిరాంబాబు సుకన్యా, సంజనా రాసలీలల బాగోతం బయటపడినప్పుడే అతన్ని కట్టడిచేసుంటే, నేడు అభంశుభం తెలియని యువతులు అవినాశ్ దాష్టీకానికి బలయ్యేవారా? ? తాడిని తన్నేవాడుంటే, వాడితలదన్నేవాడు ఉంటాడని దేవినేని అవినాశ్ గుర్తుంచుకుంటే మంచిది. క్రిమినల్స్ పార్టీలో ఉండి, నేరస్తులమధ్యన బతుకుతున్నంత మాత్రాన తననూ ఎవరూ ఏంచేయలేరనుకుంటే అవినాశ్ దారుణంగా దెబ్బతింటాడు.

మంత్రి విడదల రజనీ అనుచరుడు సాంబయ్యను అరెస్ట్ చేసే ధైర్యం పోలీసులకు ఉందా?
చిలకలూరిపేట అప్పాపురం గ్రామంలో సాంబయ్య అనే వైసీపీనేత, మంత్రి విడదలరజనీ అనుచరుడు 11ఏళ్లబాలికను శారీరకంగా లొంగదీసుకొని హింసించాడు. బాలికను చెరబట్టిన సాంబయ్య, ఆ అమ్మాయిని తనస్నేహితులకు కూడా అప్పగించి పైశాచికానందం పొందాడు. అంతటితో ఆగకుండా గుంటూరులో తనరెండోభార్య నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్లో ఆ బాలికను ఉంచి, అక్కడకూడా హింసించి, చిత్రవధచేశారు. జరిగిన ఘటనపై బాలిక పోలీసులను ఆశ్రయిస్తే, కేసు పెడతావా అంటూ మంత్రి విడదలరజనీ తమ్ముడు ఆగ్రహంతో ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించాడు. స్థానిక సీఐ రాజశేఖర్ రెడ్డి బాలికకు జరిగిన అన్యాయం పట్టించుకోకుండా, సాంబయ్యపై కేసుపెట్టకుండా మంత్రి రజనీ అడుగులకు మడుగులొత్తాడు. మహిళామంత్రే అన్నెంపున్నెం ఎరుగని బాలికను బలితీసుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాం.

ఆడబిడ్డల జీవితాలు బలితీసుకునేవారికి వాసిరెడ్డి పద్మ నోటీసులివ్వదా?
ఇలాంటి దారుణాలు లెక్కకుమిక్కిలిగా జరుగుతున్నా మహిళా కమిషన్, కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డిపద్మకు పట్టదు. అన్యాయానికి గురైన మహిళలు, యువతుల్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శిస్తే, ఆయనకు నోటీసులిచ్చిన పద్మకు, దేవినేని అవినాశ్ కు నోటీసులిచ్చే ధైర్యముందా అని నిలదీస్తున్నాం. రైల్వేస్టేషన్ లో ఒంటరిగా ఉన్నమహిళపై అత్యాచారం జరగడానికి అవకాశముందంటూ హోంమంత్రి నిస్సిగ్గుగా మాట్లాడతారు. రైల్వేస్టేషన్ లో అలా జరుగుతుందని చెప్పిన హోంమంత్రి, ఇప్పుడు విజయవాడలో వ్యభిచారకేంద్రం నడపడానికి మంచిఅవకాశం ఉందంటుందా? మహిళలు, యువతుల్ని కాపాడాల్సిన వైసీపీమహిళానేతలు, మహిళామంత్రులు క్లబ్ డ్యాన్సులు వేస్తున్నారు” అని మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Leave a Reply