Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి చేసిన పాపాలవల్లే పట్టభద్రుల నిరుద్యోగ రేటులో 24శాతంతో రాష్ట్రానికి దేశంలో ప్రథమస్థానం

• కేంద్రప్రభుత్వం ఏటా నిర్వహించే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదికలో దేశంలో పట్టభద్రులలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది
• తెలంగాణలో పట్టభద్రులలో నిరుద్యోగ రేటు 16.6 శాతముంటే, తమిళనాడులో 16.3 శాతం, కేరళలో 19.8, బీహార్లో 16.6 శాతం ఉంది.
• ఏపీలో ఈ స్థాయిలో పట్టభద్రుల్లో నిరుద్యోగరేటు పెరగడానికి జగన్ రెడ్డి అసమర్థత.. అవినీతే కారణం
• ఉద్యోగాలు దక్కక నిరాశానిస్పృహలతో గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 1745 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు
• చంద్రబాబు హాయాంలో ఏపీకి 2014-2019 మధ్యన దేశీయంగా రూ.1,26,615కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అంటే సరాసరిన ఏటా రూ.25,323 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి
• 2019 నుంచి 2022 డిసెంబర్ వరకు నాలుగేళ్లలో కేవలం సంవత్సరానికి రూ.13,515 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి
• అలానే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ (విదేశీ పెట్టుబడులు) ఆకర్షణలో కూడా ఏపీ దారుణంగా పడిపోయింది
• చంద్రబాబునాయుడు 2018-19లో ఒక్క సంవత్సరంలోనే ఏపీకి సాధించిన విదేశీ పెట్టుబడులు రూ.23,882కోట్లు అయితే, 2019 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు జగన్ రెడ్డి నాలుగేళ్లలో సాధించిన విదేశీ పెట్టుబడులు కేవలం రూ.6,679 కోట్లు మాత్రమే
• ఈ లెక్కలన్నీ మేం చెబుతున్నవి కావు.. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వార్షిక నివేదికలోని అంశాలే
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

నాలుగున్నరేళ్లకు పైబడిన తన పాలనలో జగన్ రెడ్డి సాధించిన ఘనతలు చూస్తుంటే ఏపీ ప్రజలు సిగ్గుతో తలదించు కోవాల్సిన పరిస్థితి వచ్చిందని, చంద్రబాబు హయాంలో మా రాష్ట్రం ఇదని, మేం ఇవి సాధించామని గొప్పగా చెప్పకొని కాలర్ ఎగరేసిన ఏపీ ప్రజలు నేడు జగన్ నిర్వాకాలతో అవమానభారంతో కుమిలి పోతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే తాలూకా తాజా నివేదికలో కొత్త అంశం ఒకటి బయటపడింది. చదువుకున్న యువతలో అత్యధికంగా నిరుద్యోగులున్న రాష్ట్రంగా దేశంలోనే ఏపీ ముందు వరసలో నిలిచిం ది. నిరుద్యోగంలో దేశంలోనే నంబర్ -1గా ఏపీ ఉందని, పట్టభద్రుల నిరుద్యోగంలో బీహార్ ను మించిపోయిన ఏపీ అని, అత్యధికంగా రాష్ట్రంలో 24శాతం నిరుద్యోగిత నమోదైందని కేంద్రప్రభుత్వ తాజా నివేదికలో బట్టబయలైంది. ఇలాంటి ఘనతలు మనరాష్ట్రం సాధించినట్టు పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికతో తేటతెల్లమయ్యాయి.

24 శాతం నిరుద్యోగ రేటుతో ఏపీని దేశంలోనే నంబర్ -1 స్థానంలో నిలిపిన ఘనుడు జగన్ రెడ్డి
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రమే నిరుద్యోగరేటు ఎక్కువగా ఉంది. పొరుగున ఉన్న తెలంగాణలో చదువుకున్న యువత నిరుద్యోగ రేటు 16.6 శాతముంటే, తమిళనాడులో 16.3 శాతం, కేరళలో 19.8, బీహార్లో 16.6 శాతం ఉంది. మనకంటే ఇతర రాష్ట్రాలు నిరుద్యోగరేటులో తక్కువగాఉంటే, ఏపీమాత్రం దేశంలోనే నంబర్ -1 గా నిలిచింది. ఆఖరికి చత్తీస్ ఘడ్ వంటి చిన్న రాష్ట్రాలు కూడా ఏపీకంటే ముందున్నాయి. ఏపీ యువతలో 24శాతం మంది ఉద్యోగాలు లేకుండా బాధపడటానికి కారణం ఎవరో ప్రజలు గ్రహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలు సృష్టింపడేవి. దానికి కారణం పుష్కలంగా రాష్ట్రానికి స్వదేశీ విదేశీ పెట్టుబడులు రావడం, ఉపాధి కల్పనకు ప్రభుత్వం తగిన చేయూత అందించడం, ఉపాధి ఉద్యోగాలు పొందడానికి అవసరమైన స్కిల్స్, ఇతర యాక్టివిటీస్ ను నిరుద్యోగులకు ఉచితంగా అందించ డం జరిగేది. కానీ జగన్ రెడ్డి జమానాలో నేడు అలాంటివి ఏవీ కనిపించడం లేదు.

పెట్టుబడుల ఆకర్షణ.. పరిశ్రమల ఏర్పాటులో జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యా డు. చంద్రబాబుహాయాంలో ఏపీకి 2014-2019 మధ్య దేశీయంగా రూ.1,26,615కోట్ల విలువైన పెట్టుబడులు వస్తే, 2018-19లో రూ.23,882కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. జగన్ రెడ్డి పాలనలో 2019 నుంచి 2022 డిసెంబర్ వరకు నాలుగేళ్లలో కేవలం సంవత్సరానికి రూ.13,515 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి.

పట్టభద్రులైన యువతీ యువకుల్లో నిరుద్యోగరేటు పెరగడానికి గల కారణాలు ఏమిటో విశ్లేషిద్దాం.
ప్రధాన కారణం రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడం.. పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు ఏర్పాటైతేనే యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయనేది జగమెరి గిన సత్యమే. కానీ నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పెట్టుబడుల ఆకర్ష ణలో ఘోరంగా విఫలమైంది. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి వార్షిక నివేదికలోని అంశాలే అందుకు నిదర్శనం. పెట్టుబ డులకు సంబంధించిన ఒప్పందాలు ఎంతవరకు జరిగాయో పరిశీలిస్తే…

2014లో 121 ఒప్పందాలు రూ.21,510కోట్లకు జరిగితే,
2015లో 135 ఒప్పందాలు రూ.21,300 కోట్లకు,
2016లో 164 ఒప్పందాలు రూ.34,464 కోట్లకు,
2017లో 154 ఒప్పందాలు రూ.29,537 కోట్లకు,
2018లో 161 ఒప్పందాలు రూ.19,804 కోట్లకు జరిగాయి.

మొత్తంగా 2014-2019 మధ్యన టీడీపీ ప్రభుత్వంలో రూ.1,26,615కోట్ల విలువైన ఒప్పందాలు పెట్టుబడులకు సంబంధించి జరిగాయి. అంటే సరాసరిన గమనిస్తే ఏటా రూ.25,323కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ లెక్కలు అన్నీ మేం చెప్పడంలేదు. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వార్షిక నివేదికలోని అంశాలే.

అదే విధంగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్నో కూడా చూద్దాం
2019 నుంచి 2022 డిసెంబర్ వరకు నాలుగేళ్లలో కేవలం సంవత్సరానికి రూ.13,515కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని సదరు నివేదిక చెబుతోంది. చంద్రబాబునాయుడు సాధించిన పెట్టుబడుల్లో సగానికి సగం మాత్రమే జగన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకురాగలిగాడు. అంటే టీడీపీ హాయాంతో పోలిస్తే, జగన్ జమానాలో దాదాపు సగానికిపైగా పెట్టుబడుల్ని మన రాష్ట్రం కోల్పోయింది. ఈ విధంగా పెట్టు బడులు కోల్పోతే ఇక యువతకు ఉధ్యోగాలు ఎలా లభిస్తాయి? ఎప్పుడైతే పెట్టుబ డులు రావో… పరిశ్రమలు ఏర్పాటు కావో అప్పుడే నిరుద్యోగశాతం పెరుగుతుంది.

ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ (విదేశీ పెట్టుబడులు) కూడా దారుణంగా పడిపో యాయి. 2019 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు జగన్ రెడ్డి ఏపీకి సాధించి న విదేశీ పెట్టుబడులు కేవలం రూ.6,679కోట్లు మాత్రమే.

చంద్రబాబునాయుడు 2018-19లో ఒక్క సంవత్సరంలోనే ఏపీకి సాధించిన విదే శీ పెట్టుబడులు రూ.23,882కోట్లు. దేశీయంగాకానీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ లో చంద్రబాబు సాధించిన దానికి, జగన్ రెడ్డి తీసుకొచ్చిన వాటికి ఎక్కడా పొంత న లేదు. ఈ విధంగా జగన్ రెడ్డి నిర్వాకాలతో పూర్తిగా రాష్ట్రానికి వచ్చే దేశీ, విదేశీ పెట్టుబడులు నిలిచిపోవడంతో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. దాని వల్లే ఏపీలో నిరుద్యోగ రేటు దేశంలోనే అత్యధికంగా 24శాతం నమోదైంది. తాడేపల్లి కొంపకు కమీషన్లు కట్టలేక, ప్రభుత్వ అవినీతి, వైసీపీనేతల వేధింపులు భరించలేకనే ఏపీకి పెట్టుబడులు రావడంలేదన్నది పచ్చినిజం. ఇవన్నీ ఇలా ఉంటే నిరుద్యోగులకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో నాలుగున్నరేళ్లలో ఒక్కటీ నెర వేరలేదు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి హామీల్ని జగన్ రెడ్డి విస్మరించడం యువతకు శాపంగా మారింది
ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్ రెడ్డి, నాలుగున్నరేళ్లలో ఎన్నిసార్లు ఇచ్చాడయ్యా అంటే శూన్యం. నాలుగేళ్లలో ఒకే ఒక్కసారి అదీ జూన్ 2021లో ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ ప్రకటించాడు. 99శాతం హామీలు నెరవేర్చా.. గొప్ప రికార్డు సాధించానని డబ్బాలు కొట్టుకునే జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ హమీ పై ఏం సమాధానం చెబుతాడు? ఒకసారి ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో 10,143 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎక్కడ ఇచ్చాడో ఎవరికి ఇచ్చాడో తెలియదు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీని పూర్తిగా గాలికి వదిలేశాడు. ఈ విధంగా యువతకు ఇచ్చిన హామీలు జగన్ రెడ్డి నిలబెట్టుకోకపోవడం కూడా రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు పెరగడానికి మరో కారణం.

జగన్ రెడ్డి కక్ష సాధింపులతో మూసేశాడు
చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించడంకోసం ఏర్పాటుచేసిన 40శిక్షణ కేంద్రాలను జగన్ రెడ్డి అకారణంగా, తన కక్ష సాధింపు లతో మూసేయించాడు. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల ద్వారా లక్షలాది యువతకు శిక్షణ అందించి, వేలమందికి ఉద్యోగాలు అందిస్తే, జగన్ రెడ్డి తన కక్షసాధింపులు, కడుపుమంట తో నిర్దాక్షణ్యంగా వాటిని మూసేయించాడు.

టీడీపీ ప్రభుత్వం 10లక్షల ఉద్యోగాలు కల్పించిందని కేంద్రమంత్రే చెప్పారు
చంద్రబాబు 2014-19 మధ్య రెండు సార్లు డీఎస్సీ నిర్వహించి, యువతకు 17,591 ఉద్యోగాలు ఇచ్చా రు. ఈ విధంగా టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో మొత్తంగా ఏపీలో దాదాపు 10లక్షల ఉద్యోగాలు కల్పించిందని పార్లమెం ట్ సాక్షిగా కేంద్రమంత్రే ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విధంగా తాను రాష్ట్రయువతకు ఇదిచేశానని జగ న్ రెడ్డి చెప్పగలడా?

జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని రద్దుచేశాడు
చంద్రబాబు పట్టభద్రులైన యువతీయువకులకు చేయూత అందించడంకోసం ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి కల్పించారు. ప్రతి నెలా 6 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి అందించడమే కాకుండా, వారికి అదనం గా నైపుణ్య శిక్షణ అందించడం, క్యాంపస్ ప్లేస్ మెంట్స్ నిర్వహించడం చేశారు. అలాంటి పథకాన్ని ఆపేయడం జగన్ రెడ్డి చేసిన నాలుగో తప్పిదం. అకారణంగా నిరుద్యోగ భృతిని జగన్ రెడ్డి రద్దుచేయడంతో వారికి దక్కాల్సిన ఆర్థిక లబ్ధితో పాటు, ఉద్యోగావకాశాలు కూడా లేకుండా పోయాయి. దీనివల్ల రాష్ట్రంలోని పట్టభ ద్ర యువత తీవ్రంగా నష్టపోతోంది.

జగన్ రెడ్డి చేతగానితనంతో ఉద్యోగాలు దొరక్క నాలుగేళ్లలో 1745 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు
ఉద్యోగాలు దొరక్క, రాష్ట్రంలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సీ.ఆర్.బీ) విడుదల చేసిన 2022 నివేదికే అందుకు నిదర్శనం. 2019లో 214 మంది, 2020లో 358 మంది, 2021లో 409 మంది, 2022లో 364 మంది, 2023లో 400 మంది మొత్తంగా జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో దాదాపుగా 1745 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోలే దు. ఇంతమంది యువత దారుణంగా బలైపోవడానికి కారణం ముమ్మాటికీ జగన్ రెడ్డే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా లక్షలాది నిరుద్యోగ యువతను జగన్ రెడ్డి నమ్మించి దగాచేశాడు. 1745 మంది యువత ప్రాణాలు బలితీసుకున్న నరరూప రాక్షసుడు జగన్ రెడ్డి.

యువతకు ఉపాధి కల్పించలేని జగన్ రెడ్డి వారిని గంజాయి, డ్రగ్స్ కు బానిసల్ని చేయడంలో మాత్రం ముందు నిలిచాడు
నిరుద్యోగుల్లో ఈ విధంగా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మెజారిటీ శాతం యువతను జగన్ రెడ్డి తన కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ కు బానిసల్ని చేసి తన వ్యాపార వస్తువుగా మార్చాడు. జగన్ సాగిస్తున్న గంజాయి, డ్రగ్స్ వ్యాపారాలకు ప్రధానంగా బలవుతోంది కళాశాల , పాఠశాలల విద్యార్థులే. ఏపీ గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మారిందని నార్కోటిక్స్ బ్యూరో నివేదికలే చెబుతున్నాయి. తన ధనదాహంతో జగన్ రెడ్డి మొత్తంగా ఒక తరాన్నే నాశనంచేస్తున్నాడనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి.

జగన్ రెడ్డి అవినీతి, అసమర్థత, దోపిడీతో రాష్ట్రంతో పాటు యువత దారుణంగా నష్టపోయింది. రాష్ట్ర యువత ఎవరూ నిరాశా నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడవద్దని, 3 నెలల్లో టీడీపీప్రభుత్వం వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తారని, గతంలో మాదిరే నిరుద్యోగ భృతి అందిస్తారు.” అని పట్టాభి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE