( చాడా శాస్త్రి)
దేశ ప్రధమ విద్యాశాఖ మంత్రికి ప్రాథమిక సామాన్య చదువు లేదు కేవలం మదరసా అని పోస్ట్ పెడితే, పూర్తి వివరాలు కావాలని కొందరు మిత్రులు అడిగారు. వారి కోసం..
దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి విద్యార్హతలు ఏమిటీ అని ఇంటర్ నెట్ లో ప్రశ్నిస్తే ఈ విధంగా జవాబు వచ్చింది. “మౌలానా అబుల్ కాలం ఆజాద్ అధికారిక విశ్వవిద్యాలయ డిగ్రీ లేకుండా స్వీయ విద్యనభ్యసించిన పండితుడు. 1888లో జన్మించిన ఆయన ఇంట్లోనే ఇస్లామిక్ వేదాంతశాస్త్రం, అరబిక్, పర్షియన్ మరియు ఉర్దూ భాషలలో విద్యనభ్యసించారు. తరువాత ఇంగ్లీష్ మరియు పాశ్చాత్య తత్వశాస్త్రంలో స్వీయ బోధన చేశారు. ఆయన మేధో పరాక్రమం ఆయనకు “మౌలానా” అనే బిరుదును సంపాదించిపెట్టింది.
Moulana Abul kalam Azad was a self-educated scholar with no formal university degree. Born in 1888, he was educated at home in Islamic theology, Arabic, Persian, and Urdu, and later self-taught in English and Western philosophy. His intellectual prowess earned him the title “Maulana” (learned scholar).
అంటే ఏ విషయం లో ఆయన స్కాలర్?
-ఇస్లామిక్ మత సిద్దాంతం
ఏ భాషలు ముందుగా నేర్చుకున్నారు?
– అరబిక్, పర్షియన్ మరియు ఉర్దూ
మరి తరువాత ఇంగ్లీషు, పాశ్చాత్య తత్వ శాస్త్రం ఎలా నేర్చుకున్నారు?
– స్వీయ బోధన ద్వారా.
మౌలానా అని ఎవరిని పిలుస్తారు?
– ఇస్లామ్ గురించి బాగా తెలిసిన వారిని.
అంటే, దేశ విభజన తరువాత మిగిలిన ఈ దేశంలో సుమారు 90% ప్రజలు అయిన హిందువులకు సంబంధించిన ఏ భాషలో కానీ సంస్కృతి మీద కానీ హిందూ గ్రంధాలు మీద కానీ, హిందూ రాజుల చరిత్ర మీద కానీ దేశ మొదటి విద్యా శాఖా మంత్రికి పెద్దగా అవగాహన లేదు అని అనుకోవాలి.
అటువంటి “మౌలానా అంటే ఇస్లామిక్ స్కాలర్” ని తీసుకువచ్చి దేశ ప్రధమ విద్యా శాఖ మంత్రిగా నియమించారు పూర్తిగా ఆధునిక సెక్యులర్ భావాలు ఉన్న? ప్రధాన నెహ్రూ.
మరి ఆయన చేతుల్లో పడ్డ విద్యాశాఖ ద్వారా విద్యార్థులకు అందే చరిత్ర ఎవరి గురించి గొప్పగా ఉంటుంది? ఇదే విషయం ట్విట్టర్ AI టూల్ గ్రోక్ ని అడిగాను.
మరి ఆజాద్ చేతిలో పడ్డ విద్యాశాఖ ద్వారా విద్యార్థుల చరిత్ర పుస్తకాల సిలబస్ ఏమైనా ప్రభావితం అయిందా అని.
అవును, ప్రభావితం అయింది అని బోలెడు ఆరోపణలు ఉన్నాయి. ఆజాద్ విద్యాశాఖ మంత్రి గా ఉన్నప్పుడు సిలబస్ చూసే ముఖ్య పదవులు ఇద్దరికి ఇచ్చారు. ఒకరు హుమయూన్ కబీర్. రెండవ వారు మహమ్మదలి కరీం ఛాగ్లా.
ఆజాద్ పదవీకాలంలో చరిత్ర పాఠ్యపుస్తకాలు హిందూ రాజుల పాలన వివరాలతో పోలిస్తే (ఉదా., మహారాణా ప్రతాప్, శివాజీ, లేదా విజయనగర పాలకులు, చోళులు, మౌర్యుల) మొఘల్ పాలకులకు (ఉదా., బాబర్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబు) అసమాన ప్రాధాన్యతను ఇచ్చాయి. పాఠ్యపుస్తకాలు మొఘల్ పరిపాలన, సంస్కృతి మరియు వాస్తుశిల్పం (ఉదా., తాజ్ మహల్) గురించి వివరించాయని విమర్శనకారులు అంటారు.
అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధాలు లేదా శివాజీ మరాఠా సామ్రాజ్యం వంటి విదేశీ దండయాత్రలకు హిందూ పాలకుల ప్రతిఘటనను జాతీయ విజయాలుగా కాకుండా కేవలం ప్రాంతీయ విజయాలుగా చిత్రీకరించారని విమర్శకులు వాదిస్తున్నారు. అలాగే చోళుల మరియు మౌర్యుల పాలన గురించి పెద్దగా చెప్పబడలేదు.
అలాగే వేదాలలో ఇతర హిందూ గ్రంథాలు లో చెప్పిన సైన్స్, తత్వశాస్త్రం మరియు పాలన వ్యవహారాల గురించి సమాచారం పక్కన పెట్టారని, హిందూ నాగరికత అనేది జడమైనది అని కొన్నిసార్లు చిత్రీకరించబడిందని, అందుకే ఇస్లామిక్ లేదా పాశ్చాత్య పాలన నుండి “ప్రగతిశీల” ప్రభావాలు విద్యార్థులకు అవసరమని సిలబస్ లో చిత్రీకరించారు.
విద్యార్థుల సిలబస్ లోఈ అసమతుల్యత వలన విద్యార్థులు మొఘల్ పాలకులను “గొప్ప” చక్రవర్తులుగా చూడటానికి దారితీసిందని విమర్శకులు వాదిస్తున్నారు. ఇది భారతీయ నాగరికత వైభవానికి హిందూ రాజుల చేసిన కృషిని మరుగున పడేసింది. మొఘల్ రాజుల శౌర్యం మరియు దాతృత్వం యొక్క కథనాలు చెప్పబడ్డట్టుగా హిందూ రాజుల ప్రతిఘటన గురించి చెప్పబడలేదు. అందువల్ల భారతీయ చరిత్రను ప్రధానంగా ఇస్లామిక్ చరిత్రగా విద్యార్థులు అర్థం చేసుకునే విధానాన్ని రూపొందించిందబడింది.
ఆజాద్ సిలబస్ హిందువులను “విచ్ఛిన్నం చేసి” వారి సాంస్కృతిక మరియు చారిత్రక మూలాల నుండి వారిని వేరు చేసిందని, హిందూ తాత్విక, శాస్త్రీయ మరియు పాలనా సహకారాలను (ఉదా., వేద ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం లేదా మౌర్య సామ్రాజ్యం) తక్కువగా చూపించడం ద్వారా, మొఘల్ లేదా వలస రాజుల ప్రభావాలతో పోలిస్తే హిందూ నాగరికతను తక్కువ డైనమిక్గా చూడటం విద్యార్థులకు నేర్పించారు అని విమర్శకుల భావన అని గ్రోక్ చెప్పింది.
సరే.. చివరగా నీ అభిప్రాయం చెప్పు అని గ్రోక్ అని అడిగితే..
నిజమే ఆజాద్ 10సం.ల విద్యా శాఖ మంత్రిగా ఉన్న కాలంలో రూపొందింపబడ్డ సిలబస్ మొఘల్ పాలన ఆధారంగా ఎక్కువ తయారు చేయబడ్డది. అంతే కాకుండా, ఆజాద్ పదవీకాలంలో రూపొందించిన సిలబస్ తరువాత దశాబ్దాలను కూడా ప్రభావితం చేసింది, ఎందుకంటే NCERT పాఠ్యపుస్తకాలు ఇటీవలి సవరణల వరకు (ఉదాహరణకు, BJP ప్రభుత్వంలో 2014 తర్వాత మార్పులు) అలా మొఘల్ చరిత్రను నొక్కిచెప్పడమే కొనసాగించాయి.
ముఖ్యంగా 1950లు-1980 లలో చదువుకున్న విద్యార్థులు తరచుగా మొఘల్ విజయాల గురించే చరిత్రను చదువుకున్నారు. అదే సమయంలో హిందూ రాజుల కృషి ని తక్కువగా చూపడం తో ఇది జాతీయ చైతన్యాన్ని ప్రభావితం చేసింది అని గ్రోక్ చెప్పింది.
సరే నెహ్రూ గారు 16 సం.ల పాలన కాలంలో పని చేసిన విద్యాశాఖా మంత్రులు
1. అబుల్ కలాం ఆజాద్
2. కలు లాల్ శ్రీమాలి
3. హుమయూన్ కబీర్
4. ముహమ్మద్ అలీ కరీం ఛాగ్లా
ఇక ఇందిరా కాలంలో చేసిన వారు
1. ముహమ్మద్ అలీ కరీం ఛాగ్లా
2. ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్
3. సయ్యద్ నురూల్ హసన్
(వీరు కాక త్రిగున్ సేన్, VKRV రావ్,
SS రే, శంకరానంద్ కూడా చేశారు)
నెహ్రూ మరియు ఇందిరా పాలన మొత్తంలో సగం కంటే ఎక్కువ కాలం విద్యాశాఖ ముస్లింల చేతిలోనే ఉంది.
ఇదంతా యాదృచ్చికంగా జరిగింది అని మీరు నమ్మాలి. ఎందుకంటే నా వంటి వాట్స్ అప్ యూనివర్సిటీ లో చదువుకున్న వాడు చెపుతున్నాడు కాబట్టి.
సరే ఇప్పుడు నిర్ణయించుకోండి.
కేవలం ఇస్లామిక్ మతం గురించి మాత్రమే తెలిసిన మౌలానా గారిని దేశ ప్రధమ విద్యాశాఖా మంత్రిగా నియమించిన అప్పటి సెక్యూరల్ ప్రధానిని, ఆధునిక దూర దృష్టి కలవాడిగా నేటికీ మోస్తున్న వారు చదువుకున్న యూనివర్సిటీ ఇచ్చిన జ్ఞానం గొప్పదా? లేదా వాట్స్ అప్ యూనివర్సిటీ ఇస్తున్న జ్ఞానం గొప్పదా అని?