ఇన్‌ఛార్జి మంత్రి కొడాలి నానిని కలిసిన ఎచ్చెర్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు

– నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ
గుడివాడ, సెప్టెంబర్ 16: శ్రీకాకుళం జిల్లా విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని మాజీ ఎంపీపీ బల్లాడ జనార్ధనరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు సనపల నారాయణరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరుగుళ్ళ శంకరరావులు కలిసి నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులంతా సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేశామని తెలిపారు. సీఎం జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలను అర్హులందరకీ అందేలా చూస్తున్నామన్నారు. వైసీపీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న నాయకులందరికీ సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ పదవి, అంగన్‌వాడీ పోస్టుల భర్తీ తదితరాలపై నాయకులు మంత్రి కొడాలి నానితో చర్చించారు.

Leave a Reply