– చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
వినుకొండ : సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో, మరీ ముఖ్యంగా రైతుల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సాగునీటి సంఘాలు కూటమి ఖాతాలోకే వచ్చాయని, ఇదే ఏకగ్రీవ స్ఫూర్తితో భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నాయకులు, శ్రేణులకు ఆయన సూచించారు. వినుకొండ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికైన ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అభినందించారు.
ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీసీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరిని జీవీ ఆంజనేయులు అభినందించి సత్కరించారు. రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మీసాల మురళీయాదవ్, డీఎల్డీఏ ఛైర్మన్ లగడపాటి వెంకట్రావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ముండ్రు సుబ్బారావు, వంకాయలపాటి పేరయ్య, కాకాని వీరాంజనేయులు, నక్కా వీరారెడ్డి, పెమ్మసాని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.