Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగం ఇప్పిస్తానని 3నెలలుగా అత్యాచారం చేస్తారా?…

– తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

ఏలూరు టౌన్ ఘటన బాధాకరమని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులా.. కీచకులా.. కంచే చేనుమేస్తోందనే దానికి ఇదే నిదర్శమన్నారు. పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానంటూ 3 నెలలుగా అత్యాచారం చేస్తారా?, ఎందుకు కేసు నమోదు చేయలేదు? రిమాండ్‌కి ఎందుకు పంపించరు?, కేవలం సస్పెండ్ చేస్తారా?, సీఐని ఎందుకు సర్వీస్ నుంచి తొలగించడం లేదు,

పోలీసు డిపార్ట్‌మెంట్ కాబట్టి ఉపేక్షిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. దిశా చట్టం గురించి గొప్పగా ప్రసంగాలు చేశారని, సీఎం, హోంమంత్రి బాధ్యత వహించరా..? అని ప్రశ్నించారు. సీఐని నిర్భయ్ చట్టంకింద శిక్షించాలి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE