Suryaa.co.in

Andhra Pradesh

కాలు బాగోలేక వెళ్లకపోయినా రాజకీయాలేనా..?

– బుర్రలేని అచ్చెన్న బుద్ధిలేని మాటలు
– చెప్పుకోవడానికి ఏమీ లేక.. కులాలు, మతాల గురించి టీడీపీ మాట్లాడుతుంది
– బాలకృష్ణ, లోకేశ్ లు పొలిటికల్ జోకర్లు..
– చేసింది చెప్పుకుని ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లగలిగే పార్టీ మాదే
– జగన్‌ ని ఢీకొట్టే పార్టీ ఈ రాష్ట్రంలో లేనేలేదు
-:ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక బోర్డు వైస్‌ ఛైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు

కాలు బాగోలేక వెళ్లకపోయినా రాజకీయాలేనా..?:
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి – కాలు బాగోలేక ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణానికి వెళ్లలేకపోయారు. మరుసటి రోజు కొంత మెరుగ్గా ఉండటంతో ప్రజల కోసం ఫామిలీ డాక్టర్ కార్యక్రమానికి చిలకలూరిపేట వెళ్తే దాన్ని కూడా టీడీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. వారు చెప్పుకోడానికి ఏమీ లేక, ఆఖరికి కులాలు, మతాలు గురించి మాట్లాడే స్థాయికి టీడీపీ నేతలు-అచ్చెన్నాయుడు దిగజారిపోయారు.

బాలకృష్ణ, లోకేశ్ లు పొలిటికల్ జోకర్లు..:
లోకేశ్‌ పాదయాత్రలో బాలకృష్ణ పాల్గొన్నాడు.. వాళ్లిద్దరి మాటలు చూస్తే.. పొలిటికల్ జోకర్లలా కన్పిస్తున్నారు. ఏం మాట్లాడతారో తెలియకుండా, కనీస జ్ఞానం లేకుండా, కేవలం జగన్‌ ని విమర్శించడానికే వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు మీ బావ చంద్రబాబు- ఓటుకు కోట్లు కేసులో, అరెస్టులకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చాడు. భయపడిపోయి, ప్రాంతాలు మారేది నువ్వూ, నీ బావ తప్ప వైఎస్‌ జగన్‌ కానేకాదు. ఒక నిబద్ధత, పరిపాలన దక్షత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. మేం ఈ రోజు చేస్తున్న పనులు మీ చరిత్రలో ఎందుకు చేయలేకపోయారని ఒక సారి ఆలోచన చేసుకోండి.

బుర్రలేని అచ్చెన్న బుద్ధిలేని మాటలు:
జగనన్నే మా భవిష్యత్తు.. అని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో అంటుంటే… నలుగురు ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం వెళ్లిపోయారు. ఒక టికెట్‌ ఇస్తే నలుగురు ఎమ్మెల్యేలు వస్తారని అచ్చెన్నాయుడు మాట్లాడటం బుర్రలేనితనం. పార్టీ లేదు..బొక్కా లేదని మాట్లాడిన అచ్చెన్నాయుడు- మా ఎమ్మెల్యేలు ఆఫర్స్‌ ఇస్తున్నారని మాట్లాడటం హాస్యాస్పదం, బుద్ధి లేని మాటలవి. ఎవరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గడ్డితిని, నమ్మక ద్రోహం చేసి శానసమండలి ఎన్నికల్లో మీకు ఓట్లు వేశారు. దాన్ని చూపి ఏపీ ప్రజలంతా తమ వైపు ఉన్నారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు. అది వాపే అవుతుంది తప్పితే బలం కానేకాదు. ఎవరో నలుగురు పార్టీకి నమ్మకద్రోహం చేసి మీకు ఓటేస్తే.. వారిని చూసి, ఇక అధికారంలోకి వచ్చేశామని మీరు ఊహల్లో తేలితే.. అది మీ ఖర్మ

చేసింది చెప్పుకుంటూ.. ధైర్యంగా ప్రజల వద్దకే వెళ్లగలిగే పార్టీ మాదే:
మేం ఇది చేశాం.. అని చెప్పి ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలిగిన పార్టీ ఏదైనా ఉందా అంటే.. అది ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్‌ జగన్‌ ని ఢీకొనే పార్టీ ఈ రాష్ట్రంలో లేదుముందుగా, చంద్రబాబు, అచ్చెన్నాయుడు చూసుకోవాల్సింది.. మీ తెలుగు తమ్ముళ్లు రోడ్లపై కొట్టుకుంటున్నారు.. గుడివాడకు చంద్రబాబు వెళ్లగానే తమ్ముళ్ళు పంచాయితీ పెట్టబోతున్నారు. మందు మీ పార్టీలో ఏం జరుగుతుందో చూసుకోండి… పులివెందుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. 2019 జనరల్ ఎన్నికల దగ్గర నుంచి.. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు ప్రజలు మాకే పట్టం కట్టారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదని, కనీసం అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదని చేతులెత్తేసింది మీరు కాదా..? ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా జరిగే ఎన్నికలను బహిష్కరించిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది ఒక్క తెలుగుదేశం పార్టీనే.

LEAVE A RESPONSE